ఉష్ణోగ్రతల పెరుగుదలతో చేపల ధరలకు రెక్కలు

- August 01, 2016 , by Maagulf
ఉష్ణోగ్రతల పెరుగుదలతో చేపల ధరలకు రెక్కలు

ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో ఖతారీ సముద్రజలాల్లో ఫిషింగ్‌ కష్టమవుతోంది. దాంతో, డిమాండ్‌కి తగ్గట్లుగా చేపలు దొరక్క దోహా సెంట్రల్‌ మార్కెట్‌లో చేపల ధరలకు రెక్కలు వచ్చాయి. కింగ్‌ఫిష్‌ (చనాద్‌) ధర మామూలు రోజుల్లో కిలో 30 ఖతారీ రియాల్స్‌ ఉంటే, ఆ ధర ఇప్పుడు 52 ఖతారీ రియాల్స్‌కి పెరిగింది. హేమర్‌ ధర మామూలు సీజన్‌తో పోల్చితే ఇప్పుడు రెట్టింపు అయ్యింది. షారి ధర 15 నుంచి 18 ఖతారీ రియాల్స్‌కి చేరుకుంది. ఇది మామూలుగా అయితే కేవలం 8 ఖతారీ రియాల్స్‌కే దొరుకుతుంది. సాఫి చేప ధర 35 నుంచి 55 ఖతారీ రియాల్స్‌కి పెరిగింది. సముద్రంలో చేపల వేట కష్టంగా మారిందనీ, వాతావరణ పరిస్థితులతో చేపలు సముద్రంలో దొరకడంలేదని ఫిషర్‌మెన్‌ చెప్పారు. గతంతో పోల్చితే ఇప్పుడు చేపల లభ్యత 50 శాతానికి పడిపోయిందని వారు వివరించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com