వర్క్ షాప్ లో అగ్నిప్రమాదం
- August 01, 2016
మనామా: సల్మాబాద్ పారిశ్రామిక ప్రాంతంలో ఒక వడ్రంగి కర్మాగారంలో ఆదివారం జరిగిన ఒక భారీ అగ్నిప్రమాదంలో పలు సామాగ్రి ధ్వంసం కాబడింది. ఈ ప్రమాదంలో ఎటువంటి మరణాలు ఇప్పటివరకు లేవని సమాచారం నివేదించబడింది.అంతర్గత వ్యవహారాల శాఖ పౌర రక్షణ అగ్నిమాపక బృందాలు మంటలు వేరే ప్రాంతానికి వ్యాపించకుండా విజయవంతంగా నిలువరించారని ఈ సంఘటన గూర్చి ధ్రువీకరించారు.పదిహేడు సివిల్ డిఫెన్స్ వాహనాలు మరియు 60 మంది అగ్నిమాపక సిబ్బంది ఉవెత్తున లేచిన మంటలను నియంత్రించడానికి మరియు వేరే ఇతర ప్రదేశాలకు వ్యాప్తి చెందకుండా నిలవరించారని మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది.సివిల్ రక్షణ జనరల్ డైరెక్టర్ బ్రిగేడియర్ మహమ్మద్ శౌరిటర్ ధ్రువీకరించారు "అగ్నిప్రమాదం జరగడానికి వెనుక కారణం గూర్చి పరిశీలిస్తున్నట్లు పేర్కొంటూ, ఈ ప్రమాదంలో ఎటువంటి మరణాలు నమోద కాలేదని తెలిపారు.అగ్ని ప్రమాదం సంఘటన మధ్యాహ్నం జరిగినట్లు సమాచారం అందుకొన్న వెంటనే క్షణాల్లో ఆ పారిశ్రామిక ప్రాంతానికి చేరుకోవడంతో మంటలని వెంటనే అదుపులోనికి తీసుకురావడం జరిగిందని, ఆయన తెలిపారు
తాజా వార్తలు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..







