మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు
- March 08, 2026
అమరావతి: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలోని ఆడపడుచులకు మరియు తల్లులకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. మహిళల అభివృద్ధి మరియు వారి గౌరవాన్ని పెంచడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఇందుకోసం మహిళా సాధికారత దిశగా అడుగులు వేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.
మహిళల ఆర్థిక తోడ్పాటు కోసం తల్లికి వందనం, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం మరియు దీపం-2 పథకం ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్లను అందిస్తున్నామని సీఎం గుర్తుచేశారు. అలాగే ఎన్టీఆర్ భరోసా పింఛన్ల ద్వారా లబ్ధి చేకూరుస్తూ, మెగా డీఎస్సీ ద్వారా సుమారు 8,948 మంది మహిళలకు ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కల్పించి వారి కుటుంబాల్లో వెలుగులు నింపామని వివరించారు.
రాష్ట్రంలో లక్షలాది మంది మహిళలను ఎంట్రప్రెన్యూర్లుగా తీర్చిదిద్దడమే తమ ధ్యేయమని, స్వయం శక్తితో ఎదిగేలా ప్రోత్సాహం అందిస్తున్నామని చంద్రబాబు పేర్కొన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించినప్పుడే రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని, భవిష్యత్తులో మరిన్ని వినూత్న పథకాలతో మహిళా లోకానికి అండగా ఉంటామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.
తాజా వార్తలు
- మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు
- భారత్-కివీస్ టీ20 ఫైనల్..
- మహిళలు అవకాశాలను అందిపుచ్చుకోవాలి: సీఎం రేవంత్
- ఇరాన్ పాఠశాలపై జరిగిన దాడిని ఖండించిన ట్రంప్
- 6 నెలల పోరాటానికి సిద్ధమన్న ఇరాన్!
- విమాన ప్రయాణికులకు బిగ్ అలర్ట్..
- 4 ఉమ్రా కంపెనీలను సస్పెండ్ చేసిన హజ్ మంత్రిత్వ శాఖ..!!
- మంచినీటిని వృధా చేసినందుకు రెస్టారెంట్కు నోటీసులు జారీ..!!
- ఈ వారాంతంలోనూ 3 యూఏఈ ఆకర్షణలు మూసివతే..!!
- చిక్కుకుపోయిన ప్రయాణికులకు కీలకమైన రవాణా కేంద్రంగా ఒమన్..!!









