సౌదీ అరేబియాలో క్షిపణి పడి ఇద్దరు మృతి, 12 మందికి గాయాలు
- March 08, 2026
రియాద్: సౌదీ అరేబియాలోని అల్-ఖర్జ్ నగరంలోని నివాస ప్రాంతంలో ఆదివారం ఒక క్షిపణి (ప్రాజెక్టైల్) పడటంతో ఇద్దరు మృతి చెందగా, మరో 12 మంది గాయపడ్డారని సౌదీ సివిల్ డిఫెన్స్ అధికారులు తెలిపారు.
సివిల్ డిఫెన్స్ సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’ (X) లో తెలిపిన వివరాల ప్రకారం, మృతి చెందిన ఇద్దరిలో ఒకరు భారతీయుడు కాగా మరొకరు బంగ్లాదేశ్కు చెందిన వారని వెల్లడించారు.
క్షిపణి పడటంతో నివాస ప్రాంతంలో తీవ్ర నష్టం సంభవించగా, గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఇదిలా ఉండగా, ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో సౌదీ అరేబియాలోని అల్-ఖర్జ్ సహా కొన్ని ప్రాంతాల్లో ఉన్న రాడార్ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించినట్లు తెలిపింది.
ఈ ఘటన నేపథ్యంలో ప్రాంతంలో భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేసినట్లు సౌదీ అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!
- ఒమాన్లో పొగమంచు హెచ్చరిక జారీ..!!
- మద్యం మత్తులో డ్రైవింగ్.. ఒకరి మృతి, 8 మందికి గాయాలు..!!
- ఖతార్ ఎయిర్వేస్ విమానాల్లో ‘నబ్ద్ ఖతార్’ అనుభవం..!!
- అనుమతి లేని ప్రాంతాల్లో ఈతకు వెళ్లొద్దు..!!
- షేక్ జాబర్ బ్రిడ్జిపైనుంచి జంప్.. మహిళ ఆత్మహత్యాయత్నం..!!
- యూఏఈలో టెలీమార్కెటింగ్ నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు..
- ‘ఆధార్’ పేరిట ఆ మెసేజ్ లు నమ్మవద్దు–తెలంగాణ పోలీస్
- CJP తీరు పై స్టూడెంట్స్ విమర్శలు!







