ధరల పెంపు..449 సంస్థలకు Dh176,000 ఫైన్స్..!!
- March 09, 2026
యూఏఈ: రమదాన్ ను పురస్కరించుకొని యూఏఈలో వివిధ మార్కెట్లలో సుమారు 4,468 తనిఖీలు నిర్వహించినట్లు యూఏఈ ఆర్థిక మరియు పర్యాటక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సందర్భంగా 554 ఉల్లంఘనను గుర్తించినట్లు ప్రకటించింది.
ముఖ్యంగా ధరలను ఇష్టానుసారంగా పెంచి కస్టమర్లను మోసం వాణిజ్య సముదాయాలకు 449 నోటీసులు జారీ చేసినట్లు తెలిపింది. మొత్తం Dh176,000 విలువైన జరిమానాలు విధించినట్లు మంత్విత్వశాఖ ప్రకటించింది.
దుబాయ్లోని అల్ అవీర్ సెంట్రల్ వెజిటబుల్ అండ్ ఫ్రూట్ మార్కెట్లో అధికారులతో కలిసి ఆర్థిక మరియు పర్యాటక మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రి నిర్వహించిన క్షేత్రస్థాయిలో పర్యటించి ధరలను పరిశీలించారు. నిరంతరం అధికారులు అవుట్లెట్లలో రోజువారీగా స్టాక్ ను పర్యవేక్షిస్తున్నారని మంత్రి వివరించారు.
మంత్రిత్వ శాఖ రియల్ టైమ్ ధరల ట్రాకింగ్ కోసం ఎలక్ట్రానిక్ ధరల పర్యవేక్షణ వ్యవస్థను అమలు చేస్తుంది. ఇది సహకార సంఘాలు, హైపర్మార్కెట్లు మరియు సూపర్ మార్కెట్లతో సహా 627 ప్రధాన రిటైల్ అవుట్లెట్లతో అనుసంధానించబడి ఉందని మంత్రిత్వశాఖ తెలిపింది. ఇది దేశంలోని వినియోగ వస్తువులలో దాదాపు 90 శాతానికి సమానమని ప్రకటించింది.
తాజా వార్తలు
- తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..
- అమరవీరులకు కువైట్ కన్నీటి నివాళి: సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు
- లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పై విపక్షాలు అవిశ్వాస తీర్మానం
- యూఏఈలో హెలికాప్టర్ ప్రమాదం: ఇద్దరు సాయుధ దళాల సిబ్బంది మృతి
- గల్ఫ్ దేశాల్లో 12వ తరగతి పరీక్షలు వాయిదా–CBSE కీలక నిర్ణయం
- 23400 ఉల్లంఘనలు..1,200 వాహనాలు సీజ్..!!
- వీడియోలు, ఫోటోలు షేర్.. 313 మంది అరెస్టు..!!
- విదేశాలలో చిక్కుకున్న ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్..!!
- ఆ రెండు కేసుల్లోనే అబార్షన్..షురా కౌన్సిల్ ఆమోదం..!!
- 80 అదనపు విమానాలు..97వేల మందికి లబ్ధి..!!









