వంటగ్యాస్ పై రాయితీ పెంపు
- August 01, 2016
సబ్సిడీలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్పై మరోసారి ధరల మోత మోగించింది. రాయితీ సిలిండర్పై రూ.1.93 పెంచుతున్నట్లు ప్రకటించింది. నెల వ్యవధిలో రాయితీ సిలిండర్ ధర పెరగడం ఇది రెండోసారి. జులై 1న సబ్సిడీ ఎల్పీజీపై రూ.1.98 పెంచిన విషయం తెలిసిందే. నూతన నిర్ణయం ప్రకారం దిల్లీలో 14.2 కేజీల రాయితీ సిలిండర్ ధర రూ.423.09గా ఉంది.
వంటగ్యాస్, కిరోసిన్ రాయితీలను తగ్గించేందుకు ప్రభుత్వం నెలవారీగా ధరలను పెంచే పద్ధతిని చేపట్టింది. ఇప్పటికే ప్రతినెలా లీటర్ కిరోసిన్పై రూ.25 పెంచాలని నిర్ణయించగా.. తాజాగా రాయితీ వంటగ్యాస్పై కూడా దాదాపు రూ.2 పెంచేందుకు సిద్ధమైంది. మరోవైపు సబ్సిడీయేతర గ్యాస్ ధరలను మాత్రం సదరు చమురు కంపెనీలు తగ్గిస్తూ వస్తున్నాయి. గత నెలలో రూ.11 తగ్గించగా.. తాజాగా 14.2 కిలోల సిలిండర్ ధరపై రూ.50.5 తగ్గిస్తున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. దీంతో దిల్లీలో సబ్సిడీయేతర వంటగ్యాస్ సిలిండర్ ధర రూ.487గా ఉంది.
తాజా వార్తలు
- పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ
- రికార్డు స్థాయిలో పడిపోయిన ఉష్ణోగ్రతలు..
- మహిళా క్రికెటర్ల ఫీజుపెంచిన BCCI
- కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం
- ముహర్రక్ నైట్స్ ఫెస్టివల్ ను సందర్శించిన విదేశాంగ మంత్రి..!!
- కువైట్లో ఇన్క్రెడిబుల్ ఇండియా టూరిజం ప్రమోషన్స్..!!
- ఇబ్రిలో స్టంట్ డ్రైవింగ్..ఎనిమిది మంది డ్రైవర్లు అరెస్ట్..!!
- జంతువులను వదిలేస్తున్నారా? కఠిన చర్యలు..!!
- ఖలీద్ బిన్ అహ్మద్ ఇంటర్ఛేంజ్ ఎగ్జిట్ మూసివేత..!!
- తొలి ఆర్వీ రూట్ ను ప్రారంభించిన దుబాయ్..!!







