వంటగ్యాస్‌ పై రాయితీ పెంపు

- August 01, 2016 , by Maagulf
వంటగ్యాస్‌ పై రాయితీ పెంపు

సబ్సిడీలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్‌పై మరోసారి ధరల మోత మోగించింది. రాయితీ సిలిండర్‌పై రూ.1.93 పెంచుతున్నట్లు ప్రకటించింది. నెల వ్యవధిలో రాయితీ సిలిండర్‌ ధర పెరగడం ఇది రెండోసారి. జులై 1న సబ్సిడీ ఎల్‌పీజీపై రూ.1.98 పెంచిన విషయం తెలిసిందే. నూతన నిర్ణయం ప్రకారం దిల్లీలో 14.2 కేజీల రాయితీ సిలిండర్‌ ధర రూ.423.09గా ఉంది.
వంటగ్యాస్‌, కిరోసిన్‌ రాయితీలను తగ్గించేందుకు ప్రభుత్వం నెలవారీగా ధరలను పెంచే పద్ధతిని చేపట్టింది. ఇప్పటికే ప్రతినెలా లీటర్‌ కిరోసిన్‌పై రూ.25 పెంచాలని నిర్ణయించగా.. తాజాగా రాయితీ వంటగ్యాస్‌పై కూడా దాదాపు రూ.2 పెంచేందుకు సిద్ధమైంది. మరోవైపు సబ్సిడీయేతర గ్యాస్‌ ధరలను మాత్రం సదరు చమురు కంపెనీలు తగ్గిస్తూ వస్తున్నాయి. గత నెలలో రూ.11 తగ్గించగా.. తాజాగా 14.2 కిలోల సిలిండర్‌ ధరపై రూ.50.5 తగ్గిస్తున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. దీంతో దిల్లీలో సబ్సిడీయేతర వంటగ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.487గా ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com