అబుదాబిలో డ్రోన్ శికలాలు తగిలి ఇద్దరికి గాయాలు..!!
- March 09, 2026
యూఏఈ: 10వ రోజు యూఏఈపై ఇరాన్ దాడులకు తెగబడింది. అబుదాబిలో ఓ డ్రోన్ ను వైమానిక రక్షణ వ్యవస్థలు విజయవంతంగా అడ్డుకున్న తర్వాత రెండు ప్రదేశాలలో శకలాలు పడ్డాయి. ఈ ఘటనలో జోర్డాన్, ఈజిప్షియన్ జాతీయులకు స్వల్ప గాయాలు అయ్యాయని అధికారులు తెలిపారు.
గత 10 రోజులుగా దుబాయ్, రస్ అల్ ఖైమా మరియు ఫుజైరా నగరాలతో పాటు ఇతర ప్రాంతాల్లో పలు మిస్సైల్స్, డ్రోన్లను ఎమిరేట్ ఢిపెన్స్ సిస్టమ్ విజయవంతంగా అడ్డుకున్నట్లు అధికారులు గుర్తుచేశారు.
మార్చి 5న ఇండస్ట్రియల్ సిటీ ఆఫ్ అబుదాబి (ICAD) ప్రాంతంలో డ్రోన్లను అడ్డగించడం వల్ల ఆరుగురు వ్యక్తులు గాయపడ్డారు. మార్చి 1న అబుదాబిలో డ్రోన్ శకలాలు ఎతిహాద్ టవర్లను తాకడంతో ఒక మహిళ మరియు ఆమె బిడ్డ గాయపడ్డారు. అంతకుముందు రోజు జాయెద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై డ్రోన్ దాడి జరిగింది. ఒకరు మరణించగా, ఏడుగురు గాయపడ్డారు.
తాజా వార్తలు
- ఖతార్లో ప్రయాణికుల మెడిసిన్స్ కు ఈ-పర్మిట్..!!
- ఆన్లైన్ ట్రావెల్ మోసాలపై ప్రయాణికులకు హెచ్చరిక..!!
- షేక్ ఈసా బ్రిడ్జిపై తాత్కాలికంగా ఒక లేన్ మూసివేత..!!
- బహ్రెయిన్ లో స్మాల్ బోట్స్ కు రిమోట్ టెక్నికల్ తనిఖీలు..!!
- కువైట్లో అక్రమ గర్భస్రావాల కేసు.. డాక్టర్ అరెస్ట్..!!
- జీసీసీ-యూరప్ పార్లమెంటరీ సమావేశం.. ప్రాంతీయ భద్రతపై ఆందోళన..!!
- సౌదీలో ఎండల తీవ్రత.. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు..!!
- యూఏఈలో కొత్త విద్యాసంవత్సరానికి భారీగా పెరిగిన ఖర్చులు..!!
- మూడు వారాల విరామం తర్వాత బహ్రెయిన్, కువైట్కు ఎతిహాద్ విమాన సర్వీసులు పునఃప్రారంభం
- వాహనదారులకు రవాణా శాఖ గుడ్న్యూస్







