అబుదాబిలో డ్రోన్ శికలాలు తగిలి ఇద్దరికి గాయాలు..!!
- March 09, 2026
యూఏఈ: 10వ రోజు యూఏఈపై ఇరాన్ దాడులకు తెగబడింది. అబుదాబిలో ఓ డ్రోన్ ను వైమానిక రక్షణ వ్యవస్థలు విజయవంతంగా అడ్డుకున్న తర్వాత రెండు ప్రదేశాలలో శకలాలు పడ్డాయి. ఈ ఘటనలో జోర్డాన్, ఈజిప్షియన్ జాతీయులకు స్వల్ప గాయాలు అయ్యాయని అధికారులు తెలిపారు.
గత 10 రోజులుగా దుబాయ్, రస్ అల్ ఖైమా మరియు ఫుజైరా నగరాలతో పాటు ఇతర ప్రాంతాల్లో పలు మిస్సైల్స్, డ్రోన్లను ఎమిరేట్ ఢిపెన్స్ సిస్టమ్ విజయవంతంగా అడ్డుకున్నట్లు అధికారులు గుర్తుచేశారు.
మార్చి 5న ఇండస్ట్రియల్ సిటీ ఆఫ్ అబుదాబి (ICAD) ప్రాంతంలో డ్రోన్లను అడ్డగించడం వల్ల ఆరుగురు వ్యక్తులు గాయపడ్డారు. మార్చి 1న అబుదాబిలో డ్రోన్ శకలాలు ఎతిహాద్ టవర్లను తాకడంతో ఒక మహిళ మరియు ఆమె బిడ్డ గాయపడ్డారు. అంతకుముందు రోజు జాయెద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై డ్రోన్ దాడి జరిగింది. ఒకరు మరణించగా, ఏడుగురు గాయపడ్డారు.
తాజా వార్తలు
- భారత జట్టు తదుపరి మ్యాచ్ల షెడ్యూల్ ఇదే..!
- బెంగళూరులో రేపటి నుంచి హోటళ్లు బంద్
- ప్రపంచంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా దుబాయ్–వరుసగా ఆరవ సంవత్సరం గుర్తింపు
- తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..
- అమరవీరులకు కువైట్ కన్నీటి నివాళి: సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు
- లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పై విపక్షాలు అవిశ్వాస తీర్మానం
- యూఏఈలో హెలికాప్టర్ ప్రమాదం: ఇద్దరు సాయుధ దళాల సిబ్బంది మృతి
- గల్ఫ్ దేశాల్లో 12వ తరగతి పరీక్షలు వాయిదా–CBSE కీలక నిర్ణయం
- 23400 ఉల్లంఘనలు..1,200 వాహనాలు సీజ్..!!
- వీడియోలు, ఫోటోలు షేర్.. 313 మంది అరెస్టు..!!









