అబుదాబిలో డ్రోన్ శికలాలు తగిలి ఇద్దరికి గాయాలు..!!
- March 09, 2026
యూఏఈ: 10వ రోజు యూఏఈపై ఇరాన్ దాడులకు తెగబడింది. అబుదాబిలో ఓ డ్రోన్ ను వైమానిక రక్షణ వ్యవస్థలు విజయవంతంగా అడ్డుకున్న తర్వాత రెండు ప్రదేశాలలో శకలాలు పడ్డాయి. ఈ ఘటనలో జోర్డాన్, ఈజిప్షియన్ జాతీయులకు స్వల్ప గాయాలు అయ్యాయని అధికారులు తెలిపారు.
గత 10 రోజులుగా దుబాయ్, రస్ అల్ ఖైమా మరియు ఫుజైరా నగరాలతో పాటు ఇతర ప్రాంతాల్లో పలు మిస్సైల్స్, డ్రోన్లను ఎమిరేట్ ఢిపెన్స్ సిస్టమ్ విజయవంతంగా అడ్డుకున్నట్లు అధికారులు గుర్తుచేశారు.
మార్చి 5న ఇండస్ట్రియల్ సిటీ ఆఫ్ అబుదాబి (ICAD) ప్రాంతంలో డ్రోన్లను అడ్డగించడం వల్ల ఆరుగురు వ్యక్తులు గాయపడ్డారు. మార్చి 1న అబుదాబిలో డ్రోన్ శకలాలు ఎతిహాద్ టవర్లను తాకడంతో ఒక మహిళ మరియు ఆమె బిడ్డ గాయపడ్డారు. అంతకుముందు రోజు జాయెద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై డ్రోన్ దాడి జరిగింది. ఒకరు మరణించగా, ఏడుగురు గాయపడ్డారు.
తాజా వార్తలు
- జూలై 4 నుంచి అలీ ఖమేనీ అంత్యక్రియలు..ఇరాన్ కీలక ప్రకటన
- తిరుపతి ఫిల్మ్ సిటీ విజన్కు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన
- పాన్ కార్డు ఉన్నవారికి కొత్త రూల్స్..ఇక నుంచి ఈ లావాదేవీలకు తప్పనిసరి
- ఫేక్ కన్జూమర్ ప్రొటెక్షన్ వెబ్సైట్ల పై అబుదాబి పోలీసులు హెచ్చరిక..!!
- ప్రభుత్వ స్టాంపులు ఫోర్జరీ.. ఐదుగురు బంగ్లాదేశీయులు అరెస్ట్..!!
- ఏప్రిల్లో బహ్రెయిన్ ఆపరేషన్స్ రూమ్ కు 1,606 కాల్స్..!!
- 7 రోజుల్లో 7,989 మందిని బహిష్కరించిన సౌదీ అరేబియా..!!
- జూన్ 13 యూఏఈ లాటరీ డ్రా.. విజేత నంబర్లు ఇవే..!!
- పిల్లలలో అవాంఛిత ప్రవర్తన నివారణకు క్లోజ్ మానిటరింగ్..!!
- ఒమన్ లో ఒక్క రోజులోనే భారతీయ పాస్ పోర్ట్ ప్రక్రియ పూర్తి..!!









