మిడిలీస్టు సంక్షోభం.. 40వేలకు పైగా ఫ్లైట్స్ క్యాన్సిల్..!!
- March 10, 2026
యూఏఈః మిడిలీస్టులో యుద్ధం ప్రారంభం నుంచి 40వేలకు పైగా ఫ్లైట్స్ రద్దయ్యాయి. ఈ మేరకు ఏవియేషన్ అనలిటిక్స్ కంపెనీ సిరియం డేటా తెలిపింది. ఫిబ్రవరి 28 నుండి మార్చి 9 వరకు 72వేలకకి పైగా విమానాలు షెడ్యూల్ కాగా, అందులో 40 వేలకి పైగా విమానాలు రద్దయ్యాయి.
ఇరానియన్ క్షిపణులు మరియు డ్రోన్ల బారిన పడి యూఏఈ మరియు ఇతర గల్ఫ్ దేశాలలోని విమానయాన సంస్థలు కొన్ని రోజుల సస్పెన్షన్ల తర్వాత పాక్షికంగా తిరిగి కార్యకలాపాలను ఇటీవల ప్రారంభించాయి. యూఏఈ మరియు ఇతర గల్ఫ్ దేశాలు పరిమిత విమానాలను నడపడానికి ఎయిర్ కారిడార్ను ఏర్పాటు చేశాయి.
ఫిచ్ రేటింగ్స్ ప్రకారం, ఫిబ్రవరి 28న ఇరాన్పై ఇజ్రాయెల్ మరియు అమెరికా ప్రారంభించిన దాడుల తర్వాత విమానయాన రంగం పూర్తిగా కుదైలైంది. విమానయాన సంస్థలతోపాటు విమానాశ్రయాలు, హోటల్స్, ఇన్సూరెన్స్ మరియు రియల్ ఏస్టేట్స్ రంగాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. విమానాలు నడపకపోవడం వల్ల విమానయాన సంస్థలు ఆదాయాన్ని కోల్పోతున్నాయని తెలిపింది.
తాజా వార్తలు
- సౌదీ రక్షణ దళాల చర్య: బాలిస్టిక్ క్షిపణి, రెండు డ్రోన్లు నిర్వీర్యం
- గ్యాస్ వినియోగదారులకు షాక్
- విదేశాల్లో ఇరానీయులకు హెచ్చరిక, దేశద్రోహం చేస్తే మరణశిక్ష
- రాత్రి సమయంలో ఎమర్జెన్సీ అలర్ట్ సౌండ్ లో మార్పు
- అబుదాబి నుండి భారత్కు ఎతిహాద్ విమానాలు–నేటి షెడ్యూల్
- మనామాలో నివాస భవనం పై ఇరాన్ దాడి: ఒకరు మృతి, పలువురికి గాయాలు
- కమ్యూనిటీ వర్చువల్ సమావేశం నిర్వహించిన భారత రాయబారి..!!
- అత్యవసర హెచ్చరికలు.. ప్రజలకు సౌదీ అరేబియా అప్పీల్..!!
- ఒమన్లో CBSE విద్యార్థుల పై పరీక్షల ఒత్తిడి..!!
- మిడిలీస్టు సంక్షోభం.. 40వేలకు పైగా ఫ్లైట్స్ క్యాన్సిల్..!!









