ఆహార వస్తువుల సరఫరా, ధరలపై ఆందోళన వద్దు..!!

- March 13, 2026 , by Maagulf
ఆహార వస్తువుల సరఫరా, ధరలపై ఆందోళన వద్దు..!!

మస్కట్: ఈద్ అల్ ఫితర్ సందర్భంగా ఆహార వస్తువుల సరఫరా మరియు వాటి ధరల గురించిన ఆందోళన వద్దని  వ్యవసాయం, మత్స్య మరియు జల వనరుల మంత్రిత్వ శాఖ (MoAFWR) స్పష్టం చేసింది. ఈ మేరకు సిలాల్ సెంట్రల్ మార్కెట్‌లో అనేక మంది వ్యాపారులు మరియు పెట్టుబడిదారులతో సమావేశం నిర్వహించినట్లు తెలిపింది.

వ్యవసాయం, మత్స్య మరియు జల వనరుల మంత్రిత్వ శాఖ అండర్-సెక్రటరీ డాక్టర్ అహ్మద్ బిన్ నాసర్ అల్ బక్రీ ఈ సమావేశంలో పాల్గొన్నారు.  పౌరులు మరియు నివాసితుల అవసరాలను తీర్చడానికి వస్తువుల నిరంతర సరఫరా, తద్వారా స్థానిక మార్కెట్ల స్థిరత్వాన్ని పెంచేంచేందుకు చేపట్టాల్సిన చర్యల గురించి సమావేశంలో చర్చించారు.  అలాగే, మార్కెట్ లో నిరంతర పర్యవేక్షణ ఉంటుందని పేర్కొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com