షిర్డీ సాయిబాబాకు బంగారు ‘రామ్’ అక్షరాన్ని కానుకగా సమర్పించిన దుబాయ్ భక్తులు

- August 05, 2026 , by Maagulf
షిర్డీ సాయిబాబాకు బంగారు ‘రామ్’ అక్షరాన్ని కానుకగా సమర్పించిన దుబాయ్ భక్తులు

షిర్డీ: షిర్డీ సాయిబాబాపై తమ అచంచల భక్తిని చాటుతూ దుబాయ్‌కు చెందిన భక్తులు పవన్ –  శ్వేత, అలాగే ప్రతీక్ – తమన్నా కచ్‌రూ కుటుంబ సభ్యులతో కలిసి బంగారంతో రూపొందించిన ‘రామ్’ అక్షరాన్ని షిర్డీ సాయిబాబా సంస్థాన్‌కు కానుకగా సమర్పించారు.

అత్యంత కళాత్మకంగా రూపొందించిన ఈ బంగారు ‘రామ్’ అక్షరం 76.350 గ్రాముల బరువు కలిగి ఉండగా, దీని విలువ రూ.10,03,697గా ఉంది.

ఈ సందర్భంగా షిర్డీ సాయిబాబా సంస్థాన్ అధికారులు మాట్లాడుతూ, భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది భక్తులు సాయిబాబాపై అపారమైన విశ్వాసంతో ఆలయానికి విరాళాలు, కానుకలు సమర్పిస్తుంటారని పేర్కొన్నారు. దుబాయ్‌కు చెందిన ఈ భక్తులు సమర్పించిన బంగారు కానుక కూడా వారి గాఢమైన భక్తికి నిదర్శనమని తెలిపారు.

బంగారు ‘రామ్’ అక్షరాన్ని సాయిబాబాకు సమర్పించిన అనంతరం, షిర్డీ సాయిబాబా సంస్థాన్ ముఖ్య కార్యనిర్వాహక అధికారి (సీఈఓ) గోరక్ష్ గాడిల్కర్ (ఐఏఎస్) దాత కుటుంబ సభ్యులను శాలువాతో సత్కరించి అభినందించారు.

దుబాయ్ భక్తులు సమర్పించిన ఈ ప్రత్యేక కానుకకు సంస్థాన్ కృతజ్ఞతలు తెలియజేస్తూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాయిబాబా భక్తుల ఆధ్యాత్మిక అనుబంధానికి ఇది ప్రతీకగా నిలుస్తుందని పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com