CJP తీరు పై స్టూడెంట్స్ విమర్శలు!
- August 05, 2026
ఝార్ఖండ్లో నిర్వహించిన పోటీ పరీక్షల లీకేజీలు, నియామకాల అవకతవకలపై వేలాది మంది విద్యార్థులు వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేస్తుంటే, కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నేతలు మాత్రం మైదానంలో ప్రత్యక్షంగా పాల్గొనకపోవడం తీవ్ర వివాదాస్పదమవుతోంది. తమ బృంద సభ్యులు తీవ్ర అనారోగ్యంతో ఉన్నారనే కారణంతో ప్రత్యక్ష నిరసనలకు దూరంగా ఉంటున్నామని CJP వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే తెలిపినప్పటికీ, అదే సమయంలో ఇతర నేతలు ప్రయాణాలు చేయడంపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. అనారోగ్యం నెపంతో ప్రత్యక్షంగా పాల్గొనని నేతలను కలిసేందుకు అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్లు ప్రత్యేకంగా ఢిల్లీ నుండి విమానాల్లో మహారాష్ట్ర (MH)కు చేరుకోవడంపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది.
ఢిల్లీ ప్రయాణాలు వర్తిస్తాయి కానీ విద్యార్థుల పోరాటం పట్టదా? CJP ద్వంద్వ వైఖరి
గతంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన ఆందోళనల వేళ విమానాల్లో వేగంగా చేరుకుని పర్యటించిన CJP నేతలు, ఇప్పుడు ఝార్ఖండ్ విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిన తరుణంలో కేవలం జూమ్ క్లాసులు లేదా వీడియో కాన్ఫరెన్స్లు, సోషల్ మీడియా పోస్టులకే పరిమితం కావడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఢిల్లీ నుంచి విమానాలు ఎక్కి ప్రయాణాలు చేయడానికి లేని ఇబ్బంది, ప్రత్యక్షంగా విద్యార్థుల నిరసన శిబిరానికి చేరుకోవడానికి ఎందుకు వస్తోందని నిరుద్యోగులు నిలదీస్తున్నారు. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన తర్వాత CJP తన అసలు లక్ష్యాన్ని పక్కనపెట్టి, ఎంపిక చేసిన ప్రాంతాల్లోనే స్పందిస్తూ ‘ద్వంద్వ వైఖరి’ అవలంబిస్తోందని నెటిజన్లు మరియు విద్యార్థి సంఘాల నాయకులు దుయ్యబడుతున్నారు.
తాజా వార్తలు
- CJP తీరు పై స్టూడెంట్స్ విమర్శలు!
- సౌదీలో కొత్త హౌజింగ్ నిర్మాణ విధానానికి కేబినెట్ ఆమోదం..!!
- కువైట్లో నకిలీ ప్రభుత్వ స్టాంపుల ముఠా గుట్టురట్టు..!!
- యూఏఈలో వర్కర్లను నియమించుకునే వారికి కీలక సూచనలు..!!
- అమీర్తో మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు..!!
- ఒమాన్లో ఆగస్టులో ఎండల తీవ్రత అధికం..!!
- షిర్డీ సాయిబాబాకు బంగారు ‘రామ్’ అక్షరాన్ని కానుకగా సమర్పించిన దుబాయ్ భక్తులు
- 25 టన్నుల కల్తీ మసాలా దినుసులు సీజ్ : సిపి సజ్జనార్
- మద్యం మత్తులో డ్రైవింగ్.. బహ్రెయిన్లో ఘోర ప్రమాదం
- యంగ్ ఇండియా పోలీస్ స్కూల్కు జాతీయ స్థాయి గుర్తింపు లక్ష్యం: డీజీపీ సీవీ ఆనంద్







