90 సెకన్లలో రూ.15 లక్షలు దోచేశారు
- August 01, 2016
సినిమాల్లో మాదిరిగానే ఓ ఇన్సిడెంట్ రియల్గా జరిగింది. పక్కాగా స్కెచ్ వేసి పని పూర్తి చేసి వెళ్లిపోవడం ఆ ముఠా వంతైంది. కేవలం 90 సెకన్లలో బ్యాంకుని దోపిడీ చేసింది ఓ ముఠా. కేవలం నలుగురు వ్యక్తులు మాత్రమే ఇందులో పార్టిసిపేట్ చేశారు. 90 సెకన్లలో పంజాబ్లోని లూథియానాలో పంజాబ్ నేషనల్ బ్యాంకు శాఖలో రూ.15 లక్షలు దోచేశారు. ఈ ఘటన సోమవారం మధ్యాహ్నం జరిగింది.
ఆ బ్రాంచి పోలీసు పోస్టుకు సరిగ్గా 200 మీటర్ల దూరంలో ఉంది. దొంగలు బ్యాంకులోకి ప్రవేశించే టైమ్కి బ్యాంక్లో ఓ కస్టమర్, ఆరుగురు ఉద్యోగులు మాత్రమే, కనీసం సెక్యూరిటీ గార్డు కూడా లేకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. తొలుత దొంగలు గాల్లోకి కాల్పులు జరుపుతూ బ్యాంక్ లోపలకు ప్రవేశించారు. ఇద్దరు దొంగలు లాబీలో వుండగా, ఒకడు కౌంటర్ లోవున్న క్యాషియర్ తుపాకి గురిపెట్టాడు. మరొకడు మేనేజర్ను బంధించగా, నాలుగో వ్యక్తి కొద్ది నిమిషాల కిందట కస్టమర్ డిపాజిట్ చేసిన రూ.15 లక్షలు దోపిడీ చేసేశాడు. ఎట్ ద సేమ్టైమ్ పని నిమిత్తం బ్యాంక్ లోపలకు వస్తున్న ఓ మహిళ.. ఈ తతంగాన్ని చూసి వెంటనే వెనక్కి వెళ్లి అందరికీ విషయం చెప్పింది.
చుట్టుపక్కల వాళ్లు స్పందించేలోపే దొంగలు అక్కడి నుంచి పారిపోయారు. ఈ యవ్వారం అంతా కేవలం 90 సెకన్ల వ్యవధిలో జరగడం గమనార్హం. దోపిడీ ఎలా జరిగింది అనేది పోలీసులకు అంతుచిక్కడం లేదు. సీసీకెమెరాల్లో దొంగలు ముసుగు ధరించినట్టు క్లియర్గా వుంది. ఈ దోపిడీలో ఉద్యోగుల పాత్రపై పోలీసులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. ఒక కస్టమర్, ఆరుగురు ఉద్యోగులు వున్నారన్న ఈ విషయం దోపిడీ ముఠాకు ఎలా తెలిసింది? సెక్యూరిటీ గార్డ్ ఎందుకులేడు? ఇలా రకరకాల ప్రశ్నలు రైజ్ అవుతున్నాయి.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







