కర్ణాటకలో ఘోర బస్సు ప్రమాదం..
- December 25, 2025
బెంగళూరు: కర్ణాటకలో ఓ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. గురువారం తెల్లవారు జామున.. లారీ ఒకటి..ప్రైవేట్ ట్రావెల్స్ స్లీపర్ బస్సును ఢీకొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ప్రైవేట్ ట్రావెల్ బస్సులో మంటలు చెలరేగి.. పలువురు మృతి చెందినట్లు తెలుస్తోంది.. సదరు ప్రైవేట్ ట్రావెల్ బస్సు.. బెంగళూరు నుంచి శివమొగ్గ వెళ్తుండగా.. చిత్రదుర్గ వద్ద ప్రమాదానికి గురైంది. బస్సును ఢీకొట్టిన లారీ కూడా మంటల్లో దగ్ధమైంది.
ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది.. ప్రమాద స్థలానికి చేరుకుని.. సహాయక చర్యలు ప్రారంభించారు. ఘటనా స్థలానికి చేరుకున్న వెంటనే అగ్ని మాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు శాయశక్తుల ప్రయత్నించారు. అయితే ఈ ప్రమాదంలో బస్సు కూడా పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదం కారణంగా ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఖతార్లో మెత్రాష్ యూజర్లకు కీలక సర్వీస్..!!ఖతార్లో మెత్రాష్ యూజర్లకు కీలక సర్వీస్..!!
- భారతీయులకు అబుదాబి ఉచిత టూరిస్ట్ వీసా..11 ట్రావెల్ ఏజెన్సీలు ఇవే..!!
- బర్త్ టూరిజం పై అమెరికా కఠిన చర్యలు..
- కువైట్లో ప్రైవేట్ ఫార్మసీలకు కొత్త నిబంధనలు..!!
- ఆంధ్రప్రదేశ్లో అదానీ గ్రూప్ భారీ పెట్టుబడి..రూ.16,000 కోట్ల టైటానియం ప్లాంట్
- సౌదీలో విరాళాల సేకరణ.. పిల్లలను ఉపయోగించడంపై నిషేధం..!
- ధోఫార్లో ‘ఎయిర్ స్పోర్ట్స్ విలేజ్’ ప్రారంభం..!!
- డయాబెటిక్ తో బాధపడుతున్న చిన్నారులకు కమ్యూనిటీ సపోర్ట్..!!
- BITS పిలానీ గోవా క్యాంపస్లో ఘనంగా 2026 స్నాతకోత్సవం..
- UAE అధ్యక్షుడు, బహ్రెయిన్ రాజు మధ్య భేటీ..







