కర్ణాటకలో ఘోర బస్సు ప్రమాదం..
- December 25, 2025
బెంగళూరు: కర్ణాటకలో ఓ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. గురువారం తెల్లవారు జామున.. లారీ ఒకటి..ప్రైవేట్ ట్రావెల్స్ స్లీపర్ బస్సును ఢీకొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ప్రైవేట్ ట్రావెల్ బస్సులో మంటలు చెలరేగి.. పలువురు మృతి చెందినట్లు తెలుస్తోంది.. సదరు ప్రైవేట్ ట్రావెల్ బస్సు.. బెంగళూరు నుంచి శివమొగ్గ వెళ్తుండగా.. చిత్రదుర్గ వద్ద ప్రమాదానికి గురైంది. బస్సును ఢీకొట్టిన లారీ కూడా మంటల్లో దగ్ధమైంది.
ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది.. ప్రమాద స్థలానికి చేరుకుని.. సహాయక చర్యలు ప్రారంభించారు. ఘటనా స్థలానికి చేరుకున్న వెంటనే అగ్ని మాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు శాయశక్తుల ప్రయత్నించారు. అయితే ఈ ప్రమాదంలో బస్సు కూడా పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదం కారణంగా ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా









