ఆగస్టు 12న విడుఅలాకానున్న జనతా గ్యారేజ్ ఆడియో
- August 02, 2016
ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ ఎంటర్ టైనర్ జనతా గ్యారేజ్. షూటింగ్ మొదలైనప్పటి నుంచే మంచి హైప్ క్రియేట్ చేస్తున్న ఈ సినిమాను సెప్టెంబర్ 2న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ముందుగా ఈ సినిమాను ఆగస్టు 12న రిలీజ్ చేయాలని ప్లాన్ చేసినా.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తికావన్న ఉద్దేశంతో వాయిదా వేశారు.అయితే ఎప్పటి నుంచో ఆగస్టు 12 మీద ఆశలు పెట్టుకున్న అభిమానులను నిరాశపరచకూడదని.. అదే రోజు ఆడియో రిలీజ్ ను ప్లాన్ చేశాడు జూనియర్. హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో అభిమానులు, సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా ఈ వేడుకను నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు. ఎన్టీఆర్ సరసన సమంత నిత్యామీనన్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఒక పాట మినహా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు దేశీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా, మళయాల నటులు మోహన్ లాల్, ఉన్ని ముకుందన్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ లో సత్తా చాటుతున్న జనతా గ్యారేజ్ రిలీజ్ తరువాత రికార్డ్ లు తిరగరాయటం ఖాయం అన్న నమ్మకంతో ఉన్నారు ఫ్యాన్స్.
తాజా వార్తలు
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!







