అబుదాబిలో ఇండియన్స్ అష్టకష్టాలు
- August 02, 2016
సౌదీ అరేబియా ఇతర గల్ఫ్ దేశాల్లో భారతీయ కార్మికులు అనుభవిస్తున్న కష్టాలను భారత ప్రభుత్వం పట్టించుకోవాలని రెవల్యూషనరీ సోషలిస్టు పార్టీ నేత ఎన్ కే ప్రేమచంద్రన్ డిమాండ్ చేశారు. కొంతమంది భారతీయ పౌరులు అబుదాబిలో అష్టకష్టాలు పడుతున్నారని, వారంతా రువాయిస్ అనే క్యాంపులో ఉంటూ నానా కష్టాలు పడుతున్నారని చెప్పారు.గత ఎనిమిది నెలలుగా ఆ కంపెనీ కేవలం పనిమాత్రమే చేయించుకుంటుందని, వారికి జీతభత్యాలు చెల్లించడం లేదని, కనీస అవసరాలు కూడా తీర్చడం లేదని వెంటనే కేంద్రం ఈ అంశాన్ని పట్టించుకొని పరిష్కరించాలని అన్నారు. అక్కడి అధికారులకు ఫిర్యాదుచేసినా, పోలీసులకు చెప్పినా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు లోక్ సభలో ఆయన మంగళవారం ఈ అంశాన్ని లేవనెత్తారు.
తాజా వార్తలు
- సోషల్ మీడియా దుర్వినియోగం పై సీఎం చంద్రబాబు హెచ్చరిక
- మెడికవర్ హాస్పిటల్స్ లో ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగికి లివర్ మార్పిడి
- 43 గంటలు నాన్-స్టాప్గా నడువనున్న దుబాయ్ మెట్రో..!!
- ఒమన్లో 2,510 క్యాన్సర్ కేసులు నమోదు..!!
- సౌదీ అరేబియాలో 2,200 హోండా కార్లు రీకాల్..!!
- కతారాలో 'ఫిఫా ప్రపంచ కప్ ఖతార్ 2022 లెగసీ' ప్రదర్శన..!!
- హెయిర్ డై వల్ల గాయాలు, BD5,000 కేసును తిరస్కరించిన కోర్టు..!!
- కువైట్ లో 15 ప్రైవేట్ ఫార్మసీలు సీజ్..!!
- 2026 జనవరి 1 నుంచి రాబోయే అతిపెద్ద మార్పులివే..
- వైభవ్కు ప్రతిష్ఠాత్మక బాల్ పురస్కార్







