ఒమన్లో 2,510 క్యాన్సర్ కేసులు నమోదు..!!
- December 26, 2025
మస్కట్: ఒమన్ సుల్తానేట్లో క్యాన్సర్ రేట్లు గణనీయంగా పెరిగాయి. 2021లో ఒమన్ సుల్తానేట్లో 2,510 కేసులు నమోదుకాగా, అంతకు ముందు సంవత్సరం 2,198 కేసులు నమోదయినట్లు జాతీయ క్యాన్సర్ రిజిస్ట్రీ నివేదిక తెలిపింది.
ఒమన్ దేశస్థులలో నమోదైన కేసుల సంఖ్య 2,318కి చేరగా, ఇది మొత్తం కేసులలో 92 శాతంగా ఉంది. ఇందులో పురుషులు 994 కేసులు (42.9 శాతం), మహిళలు 1,324 కేసులు (57.1 శాతం) ఉన్నారు. ఒమన్ దేశస్థులు కాని వారిలో 163 కేసులు నమోదయ్యాయి (6 శాతం). 14 సంవత్సరాలు మరియు అంతకంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలలో 155 కేసులు నమోదయ్యాయి.
జాతీయ క్యాన్సర్ రిజిస్ట్రీ 2021 సంవత్సరానికి సంబంధించిన క్యాన్సర్ నివేదికను విడుదల చేసింది. వ్యాధి నిర్ధారణ సమయంలో మహిళల సగటు వయస్సు పురుషుల కంటే తక్కువగా ఉంది. పురుషులకు 58 సంవత్సరాలతో పోలిస్తే మహిళలకు 47 సంవత్సరాలుగా ఉంది.
ఒమన్ సుల్తానేట్లో మహిళలలో రొమ్ము క్యాన్సర్ కు సంబంధించి 393 కేసులు నమోదయ్యాయి. దీని తర్వాత థైరాయిడ్ క్యాన్సర్ 196 కేసులు, కొలొరెక్టల్ క్యాన్సర్ 93 కేసులు, హాడ్కిన్ లింఫోమాకు 66 కేసులు మరియు మెదడు క్యాన్సర్కు సంబంధించి 64 కేసులు నమోదయ్యాయి. పురుషులలో 121 కేసులతో కొలొరెక్టల్ క్యాన్సర్, ఆ తర్వాత 79 కేసులతో హాడ్కిన్స్ లింఫోమా, 77 కేసులతో ప్రోస్టేట్ క్యాన్సర్, 66 కేసులతో థైరాయిడ్ క్యాన్సర్ మరియు లుకేమియాకు సంబంధించి 65 కేసులు నమోదయ్యాయి.
తాజా వార్తలు
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం







