ఒమన్, మిడిలీస్టు స్టూడెంట్స్ కోసం క్లాస్ 10 అసెస్ మెంట్ స్కీమ్..సీబీఎస్ఈ
- March 19, 2026
మస్కట్: కొనసాగుతున్న ప్రాంతీయ సంఘర్షణ కారణంగా మార్చి 5న పరీక్షలను రద్దు చేసిన అనంతరం, భారత సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) మిడిలీస్టులోని 10వ తరగతి విద్యార్థుల కోసం ఒక ప్రత్యేక అసెస్ మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఫిబ్రవరి 17 నుండి 28 మధ్య జరిగిన పరీక్షలు, 44 పేపర్లకు పూర్తయ్యాయి. ఇతర విద్యార్థులతో పాటు ఫలితాలు ప్రకటించబడతాయి. అన్ని పేపర్లకు హాజరైన విద్యార్థులను వారి వాస్తవ ప్రతిభ ఆధారంగా అసెస్ మెంట్ చేస్తారు. నాలుగు పరీక్షలు రాసిన వారికి, మిగిలిన సబ్జెక్టుకు సంబంధించిన మార్కులను వారి బెస్ట్ మూడు స్కోర్ల సగటును ఉపయోగించి లెక్కిస్తారు. మూడు పరీక్షలకు హాజరైన విద్యార్థులకు, మిగిలిన సబ్జెక్టులను వారి బెస్ట్ రెండు మార్కుల సగటును ఉపయోగించి అసెస్ మెంట్ చేస్తారు. కేవలం రెండు పరీక్షలు రాసిన వారికి, మిగిలిన అన్ని సబ్జెక్టులకు మార్కులు కేటాయించడానికి ఆ రెండు పేపర్ల సగటును పరిగణనలోకి తీసుకుంటారు.
2025 వరకు పరిమిత సబ్జెక్టులకు నమోదు చేసుకున్న విద్యార్థులను వారి వాస్తవ ప్రతిభ ఆధారంగా అసెస్ మెంట్ చేస్తారు. ఒకవేళ ఏదైనా పేపర్ రాయకపోయి ఉంటే, రెండవ బోర్డు పరీక్షలకు హాజరయ్యే అవకాశం ఉంటుంది. అంతర్గత అసెస్ మెంట్ లలో ఎలాంటి మార్పు ఉండదని, ఫలితాలే అంతిమమని, విధానానికి విరుద్ధంగా ఎలాంటి ప్రత్యేక పరీక్షలు నిర్వహించబడవని సీబీఎస్ఈ తెలిపింది. 12వ తరగతి అసెస్ మెంట్ పథకాన్ని విడిగా ప్రకటిస్తామని పేర్కొంది.
తాజా వార్తలు
- ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
- చైనాలో భారత రాయబారిగా విక్రమ్ దొరైస్వామి
- ఏపీలో 10,060 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ విడుదల..
- భారత్ లోనే తొలి గ్యాస్ ఏటీఎం
- సౌదీ మీదుగా భారత్ కు విమాన సర్వీసులు ప్రారంభించిన జజీరా ఎయిర్వేస్..!!
- ఒమన్, మిడిలీస్టు స్టూడెంట్స్ కోసం క్లాస్ 10 అసెస్ మెంట్ స్కీమ్..సీబీఎస్ఈ
- ఒమన్తో గ్రీన్ కారిడార్ను ప్రకటించిన దుబాయ్..!!
- సౌదీ అరేబియాలో మార్చి 20న ఈద్ అల్-ఫితర్..!!
- కర్బాబాద్ అగ్నిప్రమాదంలో ముగ్గురికి గాయాలు..!!
- ఇరాన్ రాయబార సిబ్బందిని 'పర్సోనా నాన్ గ్రాటా'గా ప్రకటించిన ఖతార్..!!









