రోహిత్ రెడ్డికి 3 రోజుల పోలీస్ కస్టడీ..కోర్టు కీలక ఆదేశాలు!

- March 23, 2026 , by Maagulf
రోహిత్ రెడ్డికి 3 రోజుల పోలీస్ కస్టడీ..కోర్టు కీలక ఆదేశాలు!

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మొయినాబాద్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డితో పాటు మరో ఇద్దరిని పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ రాజేంద్రనగర్ కోర్టు సోమవారం తీర్పునిచ్చింది. దీంతో డ్రగ్స్ నెట్‌వర్క్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.

కోర్టు ఆదేశాల ప్రకారం..పైలట్ రోహిత్ రెడ్డి, రితేశ్ రెడ్డి, మరియు నమిత్ శర్మలను పోలీసులు మూడు రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు.ఈరోజు (మార్చి 23) సాయంత్రం 4:30 గంటల నుంచి మార్చి 26వ తేదీ సాయంత్రం 4:30 గంటల వరకు వీరిని పోలీసులు తమ ఆధీనంలో ఉంచుకోవచ్చు.ఈ విచారణ ద్వారా డ్రగ్స్ ఎక్కడి నుండి సరఫరా అయ్యాయి మరియు ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయనే అంశాలపై స్పష్టత రానుంది.

నిందితుల విచారణ విషయంలో న్యాయస్థానం కొన్ని ప్రత్యేక నిబంధనలను విధించింది. విచారణను కేవలం పగటి పూట మాత్రమే నిర్వహించాలని స్పష్టం చేసింది. ఉదయం 6 గంటల తర్వాతే విచారణ ప్రారంభించాలని, అలాగే సాయంత్రం 7 గంటల తర్వాత విచారణ కొనసాగించకూడదని కోర్టు పోలీసులను ఆదేశించింది. నిందితుల ఆరోగ్యం మరియు హక్కులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com