ఘోర విమాన ప్రమాదం..110 మంది సైనికులతో వెళ్తుండగా ఘటన..
- March 24, 2026
కొలంబియా: దక్షిణ అమెరికా దేశమైన కొలంబియాలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. 110 మంది సైనికులతో వెళ్తున్న లాక్హీడ్ మార్టిన్ హెర్క్యులస్ సి-130 విమానం.. ప్యూర్టో లెగుయిజామో పట్టణం నుంచి టేకాఫ్ అవుతున్న సమయంలో కూలిపోయింది. విమానం కూలిపోయిన వెంటనే మంటలు అంటుకొని దట్టమైన పొగలు వ్యాపించాయి. ఘటన జరిగిన వెంటనే సహాయక చర్యలు చేపట్టారు.
రక్షణ మంత్రి పెడ్రో సాంచెజ్ ఈ ఘటన పై మాట్లాడుతూ.. పెరూ సరిహద్దులో కొలంబియా దక్షిణ అమెజాన్ ప్రాంతంలోని ప్యూర్టో లెగుయిజమో నుంచి సైనికులను తరలిస్తున్న విమానం టేకాఫ్ అవుతుండగా కూలిపోయిందని తెలిపారు. అయితే ఈ ఘటన దేశానికి తీవ్ర విషాదకరం అని ఆయన అన్నారు. ఘటన స్థలంలో సహాయక చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. మృతుల సంఖ్య, ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని ఆయన పేర్కొన్నారు.
ఇదిలాఉంటే..స్థానిక మీడియా పంచుకున్న వీడియోలో .. విమాన ప్రమాదం జరిగిన ప్రదేశంలో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. సైనికులను తీసుకెళ్తున్న ట్రక్కులు ఆ ప్రాంతానికి వెళ్లడం కనిపించింది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







