మచిలీపట్నం రైల్వే స్టేషన్లో రెండు లిఫ్ట్లు–త్వరలో పూర్తి
- March 24, 2026
మచిలీపట్నం: మచిలీపట్నం రైల్వే స్టేషన్లో ప్రయాణికుల సౌకర్యాల మెరుగుదలకు కీలక చర్యలు తీసుకోబడుతున్నాయి. స్టేషన్లో రెండు లిఫ్ట్ల నిర్మాణ పనులు త్వరలో పూర్తి కానున్నాయి.
రైల్వే స్టేషన్ నిర్మాణం పూర్తై చాలాకాలం గడిచినా, లిఫ్ట్ల నిర్మాణం ఇంకా పూర్తి కాకపోవడంతో ప్రయాణికులు, ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం బందరు ఎంపీ వల్లభనేని బాలశౌరి ఇటీవల రైల్వే అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
ప్లాట్ఫామ్ల మధ్య రాకపోకల్లో ఎదురవుతున్న సమస్యలను వివరంగా తెలియజేస్తూ, లిఫ్ట్లు అత్యవసరమని ఆయన స్పష్టం చేశారు.
ఈ విషయాన్ని సానుకూలంగా స్వీకరించిన రైల్వే అధికారులు, త్వరలోనే ఈ రెండు లిఫ్ట్ల నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఎంపీకి తెలియజేశారు.
ఈ నిర్ణయం అమల్లోకి వస్తే, మచిలీపట్నం రైల్వే స్టేషన్లో ఒక ప్లాట్ఫారం నుండి మరొకదానికి వెళ్లే ప్రయాణికుల కష్టాలకు శాశ్వత పరిష్కారం లభించనుంది.
తాజా వార్తలు
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్







