మచిలీపట్నం రైల్వే స్టేషన్లో రెండు లిఫ్ట్లు–త్వరలో పూర్తి
- March 24, 2026
మచిలీపట్నం: మచిలీపట్నం రైల్వే స్టేషన్లో ప్రయాణికుల సౌకర్యాల మెరుగుదలకు కీలక చర్యలు తీసుకోబడుతున్నాయి. స్టేషన్లో రెండు లిఫ్ట్ల నిర్మాణ పనులు త్వరలో పూర్తి కానున్నాయి.
రైల్వే స్టేషన్ నిర్మాణం పూర్తై చాలాకాలం గడిచినా, లిఫ్ట్ల నిర్మాణం ఇంకా పూర్తి కాకపోవడంతో ప్రయాణికులు, ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం బందరు ఎంపీ వల్లభనేని బాలశౌరి ఇటీవల రైల్వే అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
ప్లాట్ఫామ్ల మధ్య రాకపోకల్లో ఎదురవుతున్న సమస్యలను వివరంగా తెలియజేస్తూ, లిఫ్ట్లు అత్యవసరమని ఆయన స్పష్టం చేశారు.
ఈ విషయాన్ని సానుకూలంగా స్వీకరించిన రైల్వే అధికారులు, త్వరలోనే ఈ రెండు లిఫ్ట్ల నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఎంపీకి తెలియజేశారు.
ఈ నిర్ణయం అమల్లోకి వస్తే, మచిలీపట్నం రైల్వే స్టేషన్లో ఒక ప్లాట్ఫారం నుండి మరొకదానికి వెళ్లే ప్రయాణికుల కష్టాలకు శాశ్వత పరిష్కారం లభించనుంది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







