మచిలీపట్నం రైల్వే స్టేషన్లో రెండు లిఫ్ట్లు–త్వరలో పూర్తి
- March 24, 2026
మచిలీపట్నం: మచిలీపట్నం రైల్వే స్టేషన్లో ప్రయాణికుల సౌకర్యాల మెరుగుదలకు కీలక చర్యలు తీసుకోబడుతున్నాయి. స్టేషన్లో రెండు లిఫ్ట్ల నిర్మాణ పనులు త్వరలో పూర్తి కానున్నాయి.
రైల్వే స్టేషన్ నిర్మాణం పూర్తై చాలాకాలం గడిచినా, లిఫ్ట్ల నిర్మాణం ఇంకా పూర్తి కాకపోవడంతో ప్రయాణికులు, ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం బందరు ఎంపీ వల్లభనేని బాలశౌరి ఇటీవల రైల్వే అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
ప్లాట్ఫామ్ల మధ్య రాకపోకల్లో ఎదురవుతున్న సమస్యలను వివరంగా తెలియజేస్తూ, లిఫ్ట్లు అత్యవసరమని ఆయన స్పష్టం చేశారు.
ఈ విషయాన్ని సానుకూలంగా స్వీకరించిన రైల్వే అధికారులు, త్వరలోనే ఈ రెండు లిఫ్ట్ల నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఎంపీకి తెలియజేశారు.
ఈ నిర్ణయం అమల్లోకి వస్తే, మచిలీపట్నం రైల్వే స్టేషన్లో ఒక ప్లాట్ఫారం నుండి మరొకదానికి వెళ్లే ప్రయాణికుల కష్టాలకు శాశ్వత పరిష్కారం లభించనుంది.
తాజా వార్తలు
- మహబూలాలో ఇల్లీగల్ స్ట్రీట్ స్టాల్స్ సీజ్..!!
- రాస్ జువాయెడ్ సమీపంలో సముద్రంలో పడి వ్యక్తి మృతి..!!
- దక్షిణ అల్ బతినాలో 47 మంది అరెస్టు..!!
- డీప్ఫేక్స్ మార్గదర్శకాలను జారీ చేసిన SDAIA..!!
- గ్లోబల్ టీన్ ఆర్ట్ షోకేస్కు కతారా ఆతిథ్యం..!!
- అరబ్ గమ్యస్థానాలకు 45శాతం పెరిగిన విమాన ఛార్జీలు..!!
- హీరో మంచు మనోజ్ చేతుల మీదుగా హియ్య డైనో మండి రెస్టారెంట్ గ్రాండ్ లాంచ్
- పుట్టపర్తిలో అత్యాధునిక కార్డియాక్ క్యాథ్ ల్యాబ్ ప్రారంభం
- IPL 2026: ఐపీఎల్ ఏఐ నకిలీ టికెట్ల ముఠా అరెస్ట్
- బెంగాల్ సీఎంగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం









