రియో ఒలింపిక్స్‌కు బయలుదేరి న బ్యాడ్మింటన్‌ క్రీడాకారులు,,,

- August 03, 2016 , by Maagulf
రియో ఒలింపిక్స్‌కు బయలుదేరి న బ్యాడ్మింటన్‌ క్రీడాకారులు,,,

బ్యాడ్మింటన్‌ శిక్షకుడు పుల్లెల గోపీచంద్‌, క్రీడాకారిణి గుత్తా జ్వాల రియో ఒలింపిక్స్‌కు బయలుదేరి వెళ్లారు. సైనా, సింధూతో పాటు ఒలింపిక్స్‌కు ఎంపికైన ఆరుగురు క్రీడాకారులు రెండు నెలలపాటు కఠినమైన శిక్షణ పొందారని గోపీచంద్‌ చెప్పారు. మన క్రీడాకారులు రియోలో పతకాలు సాధించడమే లక్ష్యంగా పోటీలకు సిద్దమైనట్లు తెలిపారు. ఈ సారి ఒలింపిక్స్‌ తప్పకుండా పతకాలు సాధిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి గుత్తా జ్వాల కూడా రియోకు పయనమయ్యారు. శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి బయలుదేరిన ఈ బృందం దుబాయ్‌, సోహార్‌ మీదుగా రియో వెళ్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com