ఒమన్‌ను ముంచెత్తిన వర్షాలు..ఆరుగురి మృతి..!!

- March 24, 2026 , by Maagulf
ఒమన్‌ను ముంచెత్తిన వర్షాలు..ఆరుగురి మృతి..!!

మస్కట్: ఒమన్‌లోని కొన్ని ప్రాంతాలను భారీ వర్షాలు ముంచెత్తాయి. పలు ప్రాంతాల్లో ఆకస్మిక వరదల కారణంగా ఆరుగురు మరణించారు. అధికారులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. అస్థిర వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో పౌరులు, నివాసితులు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

దక్షిణ అల్ బతినా గవర్నరేట్‌లోని బర్కా, అల్ మావిల్‌లలో 30 మందికి పైగా ప్రజలను రక్షించగా, మృతులలో ఒక చిన్నారి కూడా ఉంది.
బర్కాలో జరిగిన ఒక విషాద సంఘటనలో ఏడేళ్ల బాలుడు నీటి కొలనులో మునిగిపోయాడు. ఆసుపత్రికి వెళ్లేలోపే ఆ బాలుడు మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.
రిమోట్ వర్క్ సలహా
ప్రస్తుతం నెలకొన్న అస్థిర వాతావరణ పరిస్థితులు, ఆకస్మిక వరదల కారణంగా, ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలు సాధ్యమైనంత వరకు రిమోట్ వర్క్‌కు మారాలని కార్మిక మంత్రిత్వ శాఖ కోరింది.
ఆన్ లైన్ లెర్నింగ్
అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు, కళాశాలలకు మార్చి 26 వరకు ఆన్ లైన్ విద్యా విధానానికి మారనున్నట్లు విద్యా మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇది ధోఫార్, అల్ వుస్తా మినహా అన్ని గవర్నరేట్లకు వర్తిస్తుంది.
సహాయ  కేంద్రాలు
జాతీయ అత్యవసర నిర్వహణ కమిటీ  సహాయ మరియు ఆశ్రయ విభాగం నివేదిక ప్రకారం, సుల్తానేట్ అంతటా 161 సహాయ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో 53 కేంద్రాలు అత్యవసర కేసుల కోసం కేటాయించారు. అల్-దఖిలియాలోని ఆడమ్‌లో ఉన్న అల్-ఘైత్రానా ప్రాథమిక విద్యా పాఠశాలలో ఒక కేంద్రాన్ని ప్రారంభించారు. ఇందులో 13 కుటుంబాలకు చెందిన మొత్తం 106 మంది వ్యక్తులు నివసిస్తున్నారు.
అస్థిర పరిస్థితులు
రాబోయే కొద్ది రోజులు అస్థిర పరిస్థితులు కొనసాగవచ్చని వాతావరణ సూచనలు తెలియజేసింది. నివాసితులు అధికారిక మార్గాల ద్వారా తాజా సమాచారాన్ని తెలుసుకోవాలని, వాడీలను దాటకుండా ఉండాలని, మరియు లోతట్టు ప్రాంతాల గుండా వాహనాలు నడపకుండా ఉండాలని సూచించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com