నిరుద్యోగ యువతకు అలర్ట్..
- March 24, 2026
హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని నిరుద్యోగ యువతకు శుభవార్త. మార్చి 28న ఉస్మానియా యూనివర్సిటీలో భారీ జాబ్ మేళా నిర్వహించబోతున్నట్లు ఓయూ ఎంప్లాయిమెంట్ బ్యూరో ప్రకటించింది. ‘భగవతి ప్రొడక్ట్స్ లిమిటెడ్ (ఫాబ్ సిటీ, రంగారెడ్డి)’ సహకారంతో ఈ నెల 28న ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో ఈ జాబ్ మేళా నిర్వహించబోతున్నట్లు ఓయూ ఎంప్లాయిమెంట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో డిప్యూటీ చీఫ్ ఒక ప్రకటనలో తెలిపారు. మార్చి 28, 2026 శనివారం ఉదయం 11:00 గంటలకు ఎంప్లాయిమెంట్ బ్యూరో కార్యాలయం, ఆర్ట్స్ కాలేజీ ఎదురుగా, ఓయూలో ఈ జాబ్ మేళా నిర్వహించనున్నారు.
మార్చి 28న నిర్వహించే జాబ్ మేళా ద్వారా ఒకేసారి 100 అప్రెంటిస్ ట్రైనీ పోస్టులను భర్తీ చేయబోతున్నారు. బీటెక్ (EEE, ECE), డిప్లొమా (EEE, ECE) ఉత్తీర్ణులైన యువతీ యువకులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని తెలిపారు. 18-35 సంవత్సరాల వయస్సు ఉన్న వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆసక్తి గల అభ్యర్థులు మార్చి 28 శనివారం ఉదయం 11 గంటల వరకు ఓయూ క్యాంపస్కు రావాల్సి ఉంటుంది. అభ్యర్థులు వచ్చేటప్పుడు.. వారి వెంట విద్యార్హత సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలను తీసుకురావాల్సిందిగా సూచించారు. మార్చి 28న ఉదయం అభ్యర్థులు నేరుగా ఓయూలోని ఎంప్లాయిమెంట్ బ్యూరో (UEI&GB/MCC) కార్యాలయానికి హాజరు కావాలని సూచించారు. మరింత సమాచారం కోసం హెచ్.ఆర్ (HR) స్పందన రెడ్డిని 9100877349 నంబర్లో సంప్రదించవచ్చని తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపారు.
తాజా వార్తలు
- చైనా గడ్డ పై కాలుమోపిన ట్రంప్...
- హైదరాబాద్లో ఉబెర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ విస్తరణ
- మహిళల టీ20 వరల్డ్కప్కు రికార్డు స్థాయిలో టికెట్ అమ్మకాలు
- BRICS విదేశాంగ మంత్రుల సమావేశానికి ఢిల్లీ చేరుకున్న ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ
- ఉత్తమ ప్రతిభావంతులైన జర్నలిస్టులకు అవార్డులు- 2025-26
- మచిలీపట్నం–రేపల్లె రైల్వే లైన్కు త్వరలో ఆమోదం
- తిరుపతిని 'గ్లోబల్ టూరిస్ట్ హబ్'గా తీర్చిదిద్దుతాం: మంత్రి కందుల దుర్గేష్
- భారత బంగారం దిగుమతి సుంకాల పెంపుతో యూఏఈ జ్యువెలరీ మార్కెట్కు ఊతం
- వెనెజువెలా పై ట్రంప్ పోస్టు..51వ రాష్ట్రం అంటూ దుమారం
- హిజాబ్ పై నిషేధాన్ని ఎత్తివేసిన కర్ణాటక ప్రభుత్వం..ఉత్తర్వులు జారీ









