టర్కీ విదేశాంగ మంత్రితో GCC, జోర్డాన్ రాయబారులు భేటీ..!!
- March 24, 2026
అంకారా: టర్కీ లో బహ్రెయిన్ రాయబారి బస్సామ్ అహ్మద్ మర్జూక్ నేతృత్వంలోGCC సభ్య దేశాలు మరియు జోర్డాన్ రాయబారులు.. టర్కీ విదేశాంగ మంత్రి హకాన్ ఫిడాన్ను ఆయన కార్యాలయంలో కలిశారు. GCC సభ్య దేశాలు మరియు జోర్డాన్పై ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు, ప్రాంతీయ పరిణామాలపై చర్చించేందుకు వారు సమావేశమయ్యారని అధికారులు తెలిపారు.
GCC సభ్య దేశాల భద్రత అనేది ఒక సమగ్రమైన మరియు విడదీయరాని వ్యవస్థ అని రాయబారులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. పౌర సదుపాయాలు, సేవా కేంద్రాలు మరియు నివాస ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ కొనసాగిస్తున్న దాడులపై సమీక్షించారు. ఈ దాడుల ఫలితంగా ప్రాణనష్టం సంభవించడంతో పాటు ఆస్తి నష్టం కూడా వాటిల్లడంపై ఆందోళన వ్యక్తం చేశారు.
ఇరాన్ ఈ దాడులను తక్షణమే నిలిపివేయాలని బస్సామ్ అహ్మద్ మర్జూక్ డిమాండ్ చేశారు. ప్రస్తుత సవాళ్లను ఎదుర్కోవడానికి, ప్రాంతీయ భద్రతను పెంపొందించే క్రమంలో ఉమ్మడి సహకారం ఎంత ముఖ్యమో ఆయన వివరించినట్లు బహ్రెయిన్ రాయబార కార్యాలయం తన ప్రకటనలో వెల్లడించింది.
తాజా వార్తలు
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి







