టర్కీ విదేశాంగ మంత్రితో GCC, జోర్డాన్ రాయబారులు భేటీ..!!

- March 24, 2026 , by Maagulf
టర్కీ విదేశాంగ మంత్రితో GCC, జోర్డాన్ రాయబారులు భేటీ..!!

అంకారా: టర్కీ లో బహ్రెయిన్ రాయబారి  బస్సామ్ అహ్మద్ మర్జూక్ నేతృత్వంలోGCC సభ్య దేశాలు మరియు  జోర్డాన్‌  రాయబారులు.. టర్కీ విదేశాంగ మంత్రి హకాన్ ఫిడాన్‌ను ఆయన కార్యాలయంలో కలిశారు. GCC సభ్య దేశాలు మరియు జోర్డాన్‌పై ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు, ప్రాంతీయ పరిణామాలపై చర్చించేందుకు వారు సమావేశమయ్యారని అధికారులు తెలిపారు.

GCC సభ్య దేశాల భద్రత అనేది ఒక సమగ్రమైన మరియు విడదీయరాని వ్యవస్థ అని రాయబారులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.  పౌర సదుపాయాలు, సేవా కేంద్రాలు మరియు నివాస ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ కొనసాగిస్తున్న దాడులపై సమీక్షించారు.  ఈ దాడుల ఫలితంగా ప్రాణనష్టం సంభవించడంతో పాటు ఆస్తి నష్టం కూడా వాటిల్లడంపై ఆందోళన వ్యక్తం చేశారు.

ఇరాన్ ఈ దాడులను తక్షణమే నిలిపివేయాలని బస్సామ్ అహ్మద్ మర్జూక్ డిమాండ్ చేశారు. ప్రస్తుత సవాళ్లను ఎదుర్కోవడానికి, ప్రాంతీయ భద్రతను పెంపొందించే క్రమంలో ఉమ్మడి సహకారం ఎంత ముఖ్యమో ఆయన వివరించినట్లు బహ్రెయిన్ రాయబార కార్యాలయం తన ప్రకటనలో వెల్లడించింది.


 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com