ప్రాపర్టీ మార్కెట్ పతనంపై ఫేక్ న్యూస్ ను ఖండించిన దుబాయ్..!!
- March 26, 2026
యూఏఈః ‘దుబాయ్ నుండి సామూహిక తరలింపు’, ‘దుబాయ్ ఇక సురక్షితం కాదు’, ‘విమానాశ్రయాలు మూతపడ్డాయి’, ‘ నిత్యవసరాల షెల్ఫ్లు ఖాళీగా ఉన్నాయి’ వంటి ఆన్లైన్లో ప్రచారంలో ఉన్న ఆందోళనకరమైన వార్తలన్ని ఫేక్ అని దుబాయ్ అధికారులు తెలిపారు. ఈ మేరకు బాయ్ ప్రభుత్వ మీడియా కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఫేక్ వార్తలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు వీలుగా ఓ వీడియోను షేర్ చేసింది.
"వదంతులను నమ్మవద్దు, వాస్తవాలపై దృష్టి పెట్టండి" అని ఆ కార్యాలయం వీడియోతో పాటు విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. "దుబాయ్ యథావిధిగా పనిచేస్తోంది. నకిలీ వార్తలతో తప్పుదోవ పట్టకండి. సమాచారం తెలుసుకోండి మరియు షేర్ చేసే ముందు ధృవీకరించుకోండి." పేర్కొంది.
బ్యాంకులు పెట్టుబడిదారుల నిధులను స్తంభింపజేస్తున్నాయని, ఆస్తి మార్కెట్ కుప్పకూలుతోందని, సంపన్న నివాసితులు, హెడ్జ్ ఫండ్లు ఎమిరేట్ నుండి పారిపోతున్నారని వంటి వైరల్ తరహా టైటిల్స్ ను ఒకచోట చేర్చి, అవి ఫేక్ వార్తలు అని వీడియోలో తేల్చిచెప్పింది.
ప్రాంతీయ ఉద్రిక్తతలు అధికంగా ఉన్న సమయాల్లో, ధృవీకరించని సమాచారాన్ని వ్యాప్తి చెందకుండా హెచ్చరించింది. తాజా సమాచారం కోసం అధికారిక మూలాలపై మాత్రమే ఆధారపడాలని అధికారులు నివాసితులకు మరియు సోషల్ మీడియా వినియోగదారులకు విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది వేడుకలు
- మార్కాపురం బస్సు ప్రమాదం...అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష
- టిప్పర్ను ఢీకొన్న ప్రైవేట్ బస్సు..14 మంది సజీవదహనం
- అల్ జబల్ అల్ అఖ్దర్, రుస్తాక్ విలాయత్లలో భారీ వర్షాలు..!!
- ప్రాపర్టీ మార్కెట్ పతనంపై ఫేక్ న్యూస్ ను ఖండించిన దుబాయ్..!!
- వాయిదాలలో ఫోన్ల పేరిట ఫ్రాడ్..వ్యక్తి అరెస్టు..!!
- సాహ్ల్ యాప్ లో విమానయాన, ట్రావెల్ ఏజెన్సీల పై ఫిర్యాదులు..!!
- ఖతార్ లో స్కూల్ బస్సుల భద్రత పై మార్గదర్శకాలు జారీ..!!
- విజిట్ వీసాను ఫైన్ లేకుండా పొడిగింపునకు సౌదీ అనుమతి..!!
- సోషల్ మీడియాకు KYC తప్పనిసరి..









