మార్కాపురం బస్సు ప్రమాదం...అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష

- March 26, 2026 , by Maagulf
మార్కాపురం బస్సు ప్రమాదం...అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష

అమరావతి: ప్రకాశం జిల్లా మార్కాపురం సమీపంలో జరిగిన భీకర బస్సు ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ దుర్ఘటనకు గల కారణాలను అధికారుల ద్వారా తెలుసుకున్న సీఎం, బాధితులకు తక్షణ సహాయం అందించాలని ఆదేశించారు.ముఖ్యమంత్రి నిర్వహించిన ఈ సమీక్షలో హోం మంత్రి వంగలపూడి అనిత, మంత్రి జనార్దన్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ప్రమాదం తీరుపై ప్రాథమిక సమాచారాన్ని సీఎంకు జిల్లా కలెక్టర్, ఎస్పీ వివరించారు.ప్రమాద సమయంలో బస్సులో 35 మంది ఉన్నారని సీఎం చంద్రబాబుకు అధికారులు తెలిపారు. వారిలో 13 మంది మృతిచెందగా.. 22 మంది గాయపడినట్లు వివరించారు. క్షతగాత్రుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందన్నారు. ప్రమాదానికి గురైన హరికృష్ణ ట్రావెల్స్ బస్సు తెలంగాణలో జగిత్యాల నుంచి వస్తున్నట్లు చెప్పారు. బస్సు డ్రైవర్ను విచారిస్తే స్టీరింగ్ స్ట్రక్ అయినట్లు చెప్పారని సీఎంకు అధికారులు తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యంతో పాటు బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com