శ్రీ కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఆరంభం
- March 26, 2026
ఒంటిమిట్ట: కడప జిల్లా ఒంటిమిట్టలోని ప్రసిద్ధ ప్రాచీన ఆలయం శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు బుధవారం పవిత్రమైన హరిద్ర ఘటనం కార్యక్రమంతో ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమం బ్రహ్మోత్సవాలు, శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవాలకు శ్రీకారం చుట్టే తొలి ఆధారంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా మహిళా భక్తులు, శ్రీవారి సేవకులు, టిటిడి అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని పసుపు కొమ్ములను దంచే పవిత్ర కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. హరిద్ర ఘటనంలో సిద్ధం చేసిన తాజా పసుపును స్వామివారికి నిర్వహించే తిరుమంజనం కార్యక్రమంలో ఉపయోగిస్తారు. అలాగే శ్రీ సీతారాముల కల్యాణోత్స వానికి అవసరమైన తలంబ్రాలు సిద్ధం చేయడానికి కూడా దీనిని వినియోగిస్తారు.
ముందుగా పసుపు కొమ్ములు ఇతర పరికరాలను గర్భాలయంలో ప్రతిష్టించి పూజలు నిర్వహించారు. అనంతరం మహాలక్ష్మి ఆరాధన చేశారు. శ్రీ సూక్తం పఠనానంతరం హరిద్ర ఘటనం నిర్వహించారు. పసుపు నూరిన తరువాత సమర్పణ చేసి తాంబూలం అందజేయడంతో కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఇది ఎ. ప్రశాంతి, డిఇ (ఎలక్ట్రికల్) సరస్వతి, పిఆర్ఓ ఎఫ్ఎసీ కుమారి నీలిమ, సూపరింటెండెంట్ హనుమంతయ్య.. ఆలయ ఇన్స్పెక్టర్ నవీన్, అర్చకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- రేపు అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోడీ కీలక సమావేశం
- కువైట్ లో ఉగ్రవాద కుట్ర భగ్నం..హిజ్బుల్లా నెట్వర్క్ బస్ట్..!!
- రుస్తాఖ్ ఆసుపత్రికి ఎమర్జెన్సీ ఎయిర్ లిఫ్ట్ సక్సెస్..!!
- ముహర్రాక్ ఫెసిలిటీలో అగ్నిప్రమాదం..!!
- ఖతార్ లో అస్థిర వాతావరణం..కార్మిక మంత్రిత్వ శాఖ గైడ్ లైన్స్ జారీ..!!
- CBSE న్యూ గ్రేడింగ్ సిస్టమ్
- సౌదీ అరేబియా వ్యాప్తంగా భారీ వర్షాలు.. అలెర్ట్ జారీ..!!
- మెట్రో, ఎసి, డీలక్స్ బస్సుల్లో 30% రాయితీ
- ఏపీ ఆస్తిపన్ను బకాయిదారులకు గుడ్ న్యూస్..
- శ్రీ కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఆరంభం









