మెట్రో, ఎసి, డీలక్స్ బస్సుల్లో 30% రాయితీ

- March 26, 2026 , by Maagulf
మెట్రో, ఎసి, డీలక్స్ బస్సుల్లో 30% రాయితీ

హైదరాబాద్: పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో తలెత్తిన ఇంధన కొరత దృష్ట్యా, నగర వాహనదారులకు ఊరటని చ్చేలా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా టీజీఎస్ ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి తెలిపారు.పెట్రోల్ బంకుల వద్ద గంటల తరబడి వేచిచూస్తున్న సామాన్యుడి కష్టాలను గమనించి, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని తక్కువ ధరకే అందించేందుకు ఆర్టీసీ సిద్ధమైంది.

హైదరాబాద్ పరిధిలోని మెట్రో ఏసీ, మెట్రో డీలక్స్ బస్సుల్లో టికెట్ ధరలపై 30 శాతం రాయితీని కల్పిస్తున్నట్లు సంస్థ ఎండీ వై.నాగిరెడ్డి ప్రకటించారు. ఈ మేరకు నగరవాసులు ఈ సేవలను వినియోగించుకోవాలని ఆయన కోరారు. పెట్రోల్తో ఇబ్బందులు పడటం ఎందుకు దండగ, ఆర్టీసీ బస్సులు ఉండగా! తమ బస్సుల్లో ప్రయాణించండని ఎండీ నాగిరెడ్డి ప్రజలకు విజప్తి చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com