భద్రాద్రిలో సీతారాముల కల్యాణ వైభవం: పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్

- March 27, 2026 , by Maagulf
భద్రాద్రిలో సీతారాముల కల్యాణ వైభవం: పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్

భద్రాచలం: దక్షిణ అయోధ్యగా ప్రసిద్ధి చెందిన భద్రాచలం పుణ్యక్షేత్రంలో సీతారాముల కల్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు.మిథులా స్టేడియంలో వేదపండితుల ఆధ్వర్యంలో జరిగిన కల్యాణ కృతువును అభిజిత్ లగ్నంలో మధ్యాహ్నం 12 గంటలకు పూర్తి చేశారు. రామదాసు చేయించిన ఆభరణాలతో స్వామివారిని, సీతమ్మవారిని అలంకరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com