ట్రంప్ నిర్ణయం..ఇరాన్ దాడులు 10 రోజులు వాయిదా
- March 27, 2026
అమెరికా: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక ప్రకటన చేశారు. ఇరాన్పై దాడులను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు.
ఇరాన్ ఎనర్జీ ప్లాంట్లపై దాడులను మరో 10 రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. ఇరాన్ అభ్యర్థన మేరకు ఏప్రిల్ 6 వరకు గడువు పొడిగించినట్లు చెప్పారు. ప్రస్తుతం రెండు దేశాల మధ్య చర్చలు సానుకూలంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.
ఇటీవల ట్రంప్ హర్మూజ్ జలసంధి తెరవాలని అల్టిమేటం ఇచ్చిన సంగతి తెలిసిందే. దీని తర్వాత ఇరాన్తో చర్చలు ప్రారంభమయ్యాయి. మొదట 5 రోజుల గడువు ఇవ్వగా, ఇప్పుడు మరింతగా పొడిగించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఒకవైపు చర్చలు కొనసాగుతున్నాయని చెబుతూనే, అమెరికా ప్రాంతంలో సైనిక బలగాలను పెంచుతోంది. ఇరాన్ మాత్రం నేరుగా చర్చల్లో పాల్గొనడం లేదని చెబుతోంది. ఇదే సమయంలో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుండటంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన నెలకొంది.
తాజా వార్తలు
- కువైట్కు ఇండిగో విమాన సర్వీసులు జూన్ 4, 2026 వరకు నిలిపివేత
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం..
- సీఎం రేవంత్ ని కలిసిన దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పాలస్ మషటైల్ బృందం
- జర్మనీ మీదుగా వెళ్లే భారతీయులకు శుభవార్త ..
- ఢిల్లీ: రెస్టారెంట్లో భారీ అగ్నిప్రమాదం..20 మంది మృతి
- భారత్కు వెళ్లే యూఏఈ ప్రయాణికులకు హెచ్చరిక..
- ఇరానియన్ దాడి నేపథ్యంలో కువైట్ విమానాశ్రయంలో అత్యవసర ప్రణాళిక అమలు..
- ఆరోగ్య పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు దుబాయ్ స్మార్ట్ మెడికల్ వీసా
- నార్వే చెస్లో ఒకే టోర్నీలో రెండుసార్లు కార్ల్సన్ను ఓడించిన ప్రజ్ఞానంద
- 2027 గోదావరి పుష్కరాలను అట్టహాసంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశం









