ఇండియన్ మీడియా రిపోర్ట్స్కి ఖండన
- August 03, 2016
సౌదీ అరేబియాలో పెద్ద సంఖ్యలో ఉన్న భారతీయ కార్మికులకు ఎలాంటి ఇబ్బందులూ లేవని, అతి కొద్ది సంస్థల చేసిన తప్పిదాలతో మొత్తం దుబాయ్లో అన్ని సంస్థలకూ ఆ తప్పులను ఆస్వాదించరాదని సౌదీలోని ఇండియన్ కమ్యూనిటీ ప్రతినిథులు చెప్పారు. ఆర్థిక ఇబ్బందులతో కొన్ని కన్స్ట్రక్షన్ కంపెనీల మూసివేతతో కార్మికులు ఇబ్బంది పడుతున్నమాట వాస్తవమే అయినప్పటికీ, మిగతావారికి ఎలాంటి ఇబ్బందులూ లేవని అక్తర్ ఉల్ ఇస్లామ్ సిద్దికి అనే ఎన్ఆర్ఐ బిజినెస్మేన్ చెప్పారు. ఈ విషయంలో ఇండియన్ మీడియాలో అత్యుత్సాహంతో కథనాలు వస్తున్నాయని ఆయన అన్నారు. కింగ్ఫిషర్, సహారా వంటి సంస్థలు ఇండియాలో బిచాణా ఎత్తేస్తే వాటి గురించి ఇండియన్ మీడియా ఇంతలా ఎందుకు ఫోకస్ పెట్టలేదని ప్రశ్నించారాయన. ఇప్పటికీ సౌదీ అరేబియా నుంచి ఇండియాకి పెద్దయెత్తున మనీ ట్రాన్స్ఫర్ అవుతోందనీ, ఇక్కడి కమ్యూనిటీకి ఇబ్బందులుంటే అదెలా సాధ్యమవుతుందని మీడియాలో పనిచేస్తున్న మోజిబ్ సిద్దికి అనే వ్యక్తి ప్రశ్నించారు. కొన్ని సంస్థలు లే ఆఫ్ వర్కర్స్ని ప్రకటించడం ఇదే కొత్త కాదని సౌదీ అరేబియాలో భారతీయ కమ్యూనిటీకి చెందినవారు వెల్లడించడం జరిగింది.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







