తెలంగాణ: అసెంబ్లీలో హేట్ స్పీచ్ బిల్లు ప్రవేశపెట్టిన ప్రభుత్వం
- March 30, 2026
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం అసెంబ్లీలో ప్రతిష్టాత్మకమైన హేట్ స్పీచ్ బిల్లు ను ప్రవేశపెట్టింది.గత సోమవారం రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం పొందిన ఈ బిల్లును, శాసనసభ స్పీకర్ తదుపరి పరిశీలన కోసం సెలెక్ట్ కమిటీకి సిఫార్సు చేశారు.సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా సాగుతున్న విద్వేష పూరిత వ్యాఖ్యలను అరికట్టడమే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశ్యం.
మతం, కులం, జాతి, లింగం, భాష లేదా నివాసం వంటి కారణాలతో విద్వేషం రేకెత్తించే వారికి ఈ చట్టం కింద కఠిన శిక్షలు ఖరారు చేశారు. విద్వేష ప్రసంగాలు లేదా పోస్టులు మొదటిసారి రుజువైతే 7 ఏళ్ల వరకు జైలు శిక్ష మరియు రూ.50,000 జరిమానా విధిస్తారు.అదే వ్యక్తి మళ్లీ నేరానికి పాల్పడితే 10 ఏళ్ల వరకు జైలు శిక్షతో పాటు రూ.1,00,000 జరిమానా ఉంటుంది.ఈ చట్టం కింద నమోదయ్యే కేసులను నాన్-బెయిలబుల్ నేరాలుగా పరిగణిస్తారు.
ఇటీవల కాలంలో సోషల్ మీడియా (Facebook, X, WhatsApp మొదలైనవి) వేదికగా రెచ్చగొట్టే పోస్టులు పెరిగాయని ప్రభుత్వం భావిస్తోంది. కేవలం ప్రసంగాలే కాకుండా మాటల ముద్రణ, ప్రచురణ, సోషల్ మీడియా పోస్టులు, ఎలక్ట్రానిక్ సందేశాలు కూడా ఈ చట్టం పరిధిలోకి వస్తాయి.ఏదైనా అసభ్యకర లేదా విద్వేష పూరిత కంటెంట్ ఉంటే, వాటిని వెంటనే తొలగించాలని సర్వీస్ ప్రొవైడర్లను ఆదేశించే అధికారం అధికారులకు ఉంటుంది.సంఘం, సమూహం లేదా బహిరంగ సమావేశాల్లో రెచ్చగొట్టేలా మాట్లాడితే కఠిన చర్యలు తప్పవు.
తాజా వార్తలు
- తమిళనాడు కొత్త కేబినెట్ ప్రకటించిన విజయ్..ఎవరికి ఏ శాఖ?
- మల్కాజిగిరి కమిషనరేట్లో పోక్సో చట్టం అమలు పై రెండు రోజుల శిక్షణ కార్యక్రమం
- హయాకోమ్.. వరదల ఆందోళనలపై చర్చ..!!
- రియాద్ మెట్రో వెస్ట్రన్ స్టేషన్ ప్రారంభం..!!
- జనన, మరణ రిజిస్ట్రేషన్..వర్కింగ్ అవర్స్ ప్రకటించిన MoPH..!!
- సోషల్ మీడియాలో బంధువు ఫోటోలు పోస్ట్.. Dh3,000 ఫైన్..!!
- యంగ్ లీడర్స్.. మస్కట్ లో జాతీయ కార్యక్రమం ప్రారంభం..!!
- ఫ్లైట్ లో ప్రయాణికుడిని రక్షించిన యూఏఈ నర్సు..!!
- మే 23 నుండి బెంగళూరు–ముంబై కొత్త రైలు ప్రారంభం!
- SRH vs RCB మ్యాచ్ టికెట్ల పేరిట కొత్త సైబర్ దందా.. సీపీ సజ్జనార్ హెచ్చరిక!









