సెప్టెంబరు ఏడో తేదీన 'రెమో' సినిమా విడుదల..
- August 03, 2016
శివకార్తికేయన్, కీర్తిసురేష్ జంటగా తెరకెక్కుతున్న రెండో సినిమా 'రెమో'. భాగ్యరాజ్ కన్నన్ దర్శకత్వం వహిస్తున్నారు. 24 ఏఎం స్టూడియో నిర్మిస్తోంది. ఇందులో నటనాపరంగా శివకార్తికేయన్ ఓ అడుగు ముందుకేసి నర్సుగా కూడా కనిపించనున్నారు. ఈ సినిమా చిత్రీకరణ మంగళవారంతో పూర్తయింది. చిత్ర యూనిట్లోనే సీనియర్ కళాకారుడైన సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ను ఈ సందర్భంగా సన్మానించారు. అనంతరం యూనిట్ సభ్యులు మాట్లాడుతూ.... '' దేశం గర్వించదగిన సినిమాటోగ్రాఫర్లలో పీసీ శ్రీరామ్ ఒకరు. మా సినిమాకు ఆయన పనిచేయడం గొప్పగా భావిస్తున్నాం. అందువల్లే చిత్రీకరణ పూర్తయిన సందర్భంగా ఆయనకు కృతజ్ఞతలు తెలిపాం. డబ్బింగ్ పనులు కొన్ని రోజుల క్రితం నుంచే జరుగుతున్నాయి. నిర్మాణాంతర పనులను ఈ నెలాఖరుకల్లా పూర్తి చేయాలని భావిస్తున్నాం. సెప్టెంబరు ఏడో తేదీన సినిమా విడుదల చేయనున్నామ''ని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







