చంద్రుడిపైకి తొలిసారిగా ఓ ప్రైవేటు సంస్థ వ్యోమనౌక...

- August 03, 2016 , by Maagulf
చంద్రుడిపైకి తొలిసారిగా ఓ ప్రైవేటు సంస్థ వ్యోమనౌక...

చంద్రుడిపైకి తొలిసారిగా ఓ ప్రైవేటు సంస్థ వ్యోమనౌకను పంపనుంది. ఫ్లోరిడా సంస్థ 'మూన్‌ ఎక్స్‌ప్రెస్‌' ఈ ప్రయోగం చేపట్టేందుకు అమెరికా బుధవారం పచ్చజెండా వూపింది. దీంతో వచ్చే ఏడాది సూట్‌కేస్‌ పరిమాణంలోని వ్యోమనౌకను పంపుతామని మూన్‌ ఎక్స్‌ప్రెస్‌ సీఈవో బాబ్‌ రిచార్డ్స్‌ వెల్లడించారు. రెండు వారాల పాటు తమ ప్రయోగం కొనసాగుతుందని తెలిపారు. చంద్రుడి ఉపరితలంపై తాము భిన్న ప్రయోగాలు చేపడతామని, మానవ మృతదేహ అవశేషాలను కూడా అక్కడకు పంపుతామని వివరించారు. అయితే ఈ ప్రయోగం కోసం అమెరికా కొన్ని న్యాయ, నియంత్రణ నిబంధనలను సిద్ధంచేసింది. వీటికి లోబడే ప్రయోగం జరగాలని స్పష్టంచేసింది.దీంతోమరికొన్ని ప్రైవేటు సంస్థలు అంతరిక్ష ప్రయోగాలకు సిద్ధమవుతున్నాయి. అంగారకుడిపైకి 2018లో వ్యోమనౌకను పంపేందుకు స్పేస్‌ ఎక్స్‌ప్లోరేషన్‌ టెక్నాలజీస్‌ సీఈవో ఎలాన్‌ మస్క్‌ ప్రణాళికలు రచిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com