చంద్రుడిపైకి తొలిసారిగా ఓ ప్రైవేటు సంస్థ వ్యోమనౌక...
- August 03, 2016
చంద్రుడిపైకి తొలిసారిగా ఓ ప్రైవేటు సంస్థ వ్యోమనౌకను పంపనుంది. ఫ్లోరిడా సంస్థ 'మూన్ ఎక్స్ప్రెస్' ఈ ప్రయోగం చేపట్టేందుకు అమెరికా బుధవారం పచ్చజెండా వూపింది. దీంతో వచ్చే ఏడాది సూట్కేస్ పరిమాణంలోని వ్యోమనౌకను పంపుతామని మూన్ ఎక్స్ప్రెస్ సీఈవో బాబ్ రిచార్డ్స్ వెల్లడించారు. రెండు వారాల పాటు తమ ప్రయోగం కొనసాగుతుందని తెలిపారు. చంద్రుడి ఉపరితలంపై తాము భిన్న ప్రయోగాలు చేపడతామని, మానవ మృతదేహ అవశేషాలను కూడా అక్కడకు పంపుతామని వివరించారు. అయితే ఈ ప్రయోగం కోసం అమెరికా కొన్ని న్యాయ, నియంత్రణ నిబంధనలను సిద్ధంచేసింది. వీటికి లోబడే ప్రయోగం జరగాలని స్పష్టంచేసింది.దీంతోమరికొన్ని ప్రైవేటు సంస్థలు అంతరిక్ష ప్రయోగాలకు సిద్ధమవుతున్నాయి. అంగారకుడిపైకి 2018లో వ్యోమనౌకను పంపేందుకు స్పేస్ ఎక్స్ప్లోరేషన్ టెక్నాలజీస్ సీఈవో ఎలాన్ మస్క్ ప్రణాళికలు రచిస్తున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







