చంద్రుడిపైకి తొలిసారిగా ఓ ప్రైవేటు సంస్థ వ్యోమనౌక...
- August 03, 2016
చంద్రుడిపైకి తొలిసారిగా ఓ ప్రైవేటు సంస్థ వ్యోమనౌకను పంపనుంది. ఫ్లోరిడా సంస్థ 'మూన్ ఎక్స్ప్రెస్' ఈ ప్రయోగం చేపట్టేందుకు అమెరికా బుధవారం పచ్చజెండా వూపింది. దీంతో వచ్చే ఏడాది సూట్కేస్ పరిమాణంలోని వ్యోమనౌకను పంపుతామని మూన్ ఎక్స్ప్రెస్ సీఈవో బాబ్ రిచార్డ్స్ వెల్లడించారు. రెండు వారాల పాటు తమ ప్రయోగం కొనసాగుతుందని తెలిపారు. చంద్రుడి ఉపరితలంపై తాము భిన్న ప్రయోగాలు చేపడతామని, మానవ మృతదేహ అవశేషాలను కూడా అక్కడకు పంపుతామని వివరించారు. అయితే ఈ ప్రయోగం కోసం అమెరికా కొన్ని న్యాయ, నియంత్రణ నిబంధనలను సిద్ధంచేసింది. వీటికి లోబడే ప్రయోగం జరగాలని స్పష్టంచేసింది.దీంతోమరికొన్ని ప్రైవేటు సంస్థలు అంతరిక్ష ప్రయోగాలకు సిద్ధమవుతున్నాయి. అంగారకుడిపైకి 2018లో వ్యోమనౌకను పంపేందుకు స్పేస్ ఎక్స్ప్లోరేషన్ టెక్నాలజీస్ సీఈవో ఎలాన్ మస్క్ ప్రణాళికలు రచిస్తున్నారు.
తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









