కువైట్ లో ఉగ్రవాద విచారణలు వేగవంతం..!!

- April 01, 2026 , by Maagulf
కువైట్ లో ఉగ్రవాద విచారణలు వేగవంతం..!!

కువైట్: 2026 మొదటి మూడు నెలల్లో ఉగ్రవాద కేసులు 500 శాతం పెరిగాయని అధికారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఉగ్రవాద కేసులను విచారించేందుకు ప్రత్యేక న్యాయస్థానాలను ఏర్పాటు చేస్తూ అమీరీ డిక్రీ జారీ అయింది. 
విచారణలో సాధారణంగా ఉండే మూడు దశలకు బదులుగా కేవలం రెండు దశలలో విచారణ చేయనున్నారు. 

ఉగ్రవాద సంబంధిత కేసులను విచారించడానికి ఒక ప్రత్యేక ప్రాసిక్యూషన్‌ను ఏర్పాటు చేస్తూ అటార్నీ జనరల్ సాద్ అల్-సఫ్రాన్ ఉత్తర్వులు జారీ చేసిన ఒక రోజు తర్వాత ఈ డిక్రీ వెలువడింది. 

ఇదిలా ఉండగా, ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో ఉగ్రవాదం మరియు రాష్ట్ర భద్రతకు సంబంధించిన కేసులు 500 శాతం పెరిగాయని, 209 కేసులు నమోదయ్యాయని న్యాయశాఖ మంత్రి నాసర్ అల్-సుమైత్ తెలిపారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com