స్కాలర్ షిప్ దరఖాస్తు గడువు 20 వరకు పొడిగింపు
- April 01, 2026
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ, పీహెచ్సీ విద్యార్థులు స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి దరఖాస్తు గడువును పొడిగించారు. గతంలో ప్రకటించినట్టుగా దరఖాస్తు గడువు మార్చి 31 వరకు ఉండగా.. దానిని కాస్త ఈ నెల 20 వరకు పొడిగించారు. 2025-26 విద్యా సంవత్సరానికి కొత్తగా స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకోవడంతోపాటు గతంలో దరఖాస్తు చేసుకొని రెన్యూవల్ స్కాలర్షిప్ల మంజూరు కోసం తెలంగాణ ఇపాస్ వెబ్సైట్లో కళాశాలలు, విద్యార్థుల నమోదుకు గడువును ఈ నెల 20 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
పోస్ట్మెట్రిక్ స్కాలర్షిప్ల మంజూరు పంపిణీలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని నిర్ధారించడానికి ఇపాస్ పోర్టల్ అనే ఆన్లైన్ సిస్టమ్ వెబ్సైట్ను అమలు చేస్తున్నారు. పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ కింద కొత్తగా దరఖాస్తు, పునరుద్ధరణ స్కాలర్షిప్ల మంజూరు కోసం డేటాను ప్రాసెస్ చేయడానికి, నమోదు చేసుకోవడానికి ఈ సిస్టమ్ కళాశాలలు, విద్యార్థుల రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం కల్పించారు. గత ఏడాది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ, పీహెచ్సీ విద్యార్థులు 10,89,253 మంది స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 9,70,243 మంది మాత్రమే నమోదు చేసుకున్నారు. కొత్తగా వివిధ కోర్సుల్లో 2025-26 విద్యా సంవత్సరంలో చేరిన విద్యార్థుల్లో ఇప్పటి వరకు 3,70,375 మంది మాత్రమే స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.
తాజా వార్తలు
- ట్యాంక్ బండ్ శివకు సీఎం భారీ సాయం
- స్కాలర్ షిప్ దరఖాస్తు గడువు 20 వరకు పొడిగింపు
- AN-26 విమానం కుప్పకూలి 29 మంది దుర్మరణం
- కువైట్ లో ఉగ్రవాద విచారణలు వేగవంతం..!!
- యూఏఈలో పెట్రోల్ బంకుల వద్ద భారీగా క్యూ లైన్లు..!!
- కువైట్కు కొత్త బస్సు మార్గాలను ప్రకటించిన సౌదీ..!!
- మస్కట్లో డిస్టన్స్ లెర్నింగ్ ప్రారంభం..!!
- ఇరాన్ దాడులతో గల్ఫ్ దేశాలను రెచ్చగొడుతుంది..!!
- రక్షణ సహకారం పై ఖతార్ ప్రధాని, యూకే రక్షణ కార్యదర్శి చర్చలు..!!
- గుజరాత్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం









