స్కాలర్ షిప్ దరఖాస్తు గడువు 20 వరకు పొడిగింపు
- April 01, 2026
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ, పీహెచ్సీ విద్యార్థులు స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి దరఖాస్తు గడువును పొడిగించారు. గతంలో ప్రకటించినట్టుగా దరఖాస్తు గడువు మార్చి 31 వరకు ఉండగా.. దానిని కాస్త ఈ నెల 20 వరకు పొడిగించారు. 2025-26 విద్యా సంవత్సరానికి కొత్తగా స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకోవడంతోపాటు గతంలో దరఖాస్తు చేసుకొని రెన్యూవల్ స్కాలర్షిప్ల మంజూరు కోసం తెలంగాణ ఇపాస్ వెబ్సైట్లో కళాశాలలు, విద్యార్థుల నమోదుకు గడువును ఈ నెల 20 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
పోస్ట్మెట్రిక్ స్కాలర్షిప్ల మంజూరు పంపిణీలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని నిర్ధారించడానికి ఇపాస్ పోర్టల్ అనే ఆన్లైన్ సిస్టమ్ వెబ్సైట్ను అమలు చేస్తున్నారు. పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ కింద కొత్తగా దరఖాస్తు, పునరుద్ధరణ స్కాలర్షిప్ల మంజూరు కోసం డేటాను ప్రాసెస్ చేయడానికి, నమోదు చేసుకోవడానికి ఈ సిస్టమ్ కళాశాలలు, విద్యార్థుల రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం కల్పించారు. గత ఏడాది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ, పీహెచ్సీ విద్యార్థులు 10,89,253 మంది స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 9,70,243 మంది మాత్రమే నమోదు చేసుకున్నారు. కొత్తగా వివిధ కోర్సుల్లో 2025-26 విద్యా సంవత్సరంలో చేరిన విద్యార్థుల్లో ఇప్పటి వరకు 3,70,375 మంది మాత్రమే స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.
తాజా వార్తలు
- IPL2026: ప్లే ఆఫ్స్కు హైదరాబాద్..చెన్నై ఘన విజయం
- 'స్మైలింగ్ బుద్ధా' అణు పరీక్షకు 52 ఏళ్లు: మల్లికార్జున ఖర్గే
- నక్సల్స్ రహిత తెలంగాణను తీర్చిదిద్దిన పోలీస్ అధికారులకు సన్మానం..!
- అత్యంత అరుదైన కిడ్నీ క్యాన్సర్ను జయించిన 8 నెలల చిన్నారి
- మహారాష్ట్ర విద్యార్థులతో ‘యువ సంగం’ కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్ అబ్దుల్ నజీర్
- ఎస్ఐబీ కార్యాలయాన్ని సందర్శించిన డీజీపీ సి.వి.ఆనంద్
- కర్ణాటక దుబారే క్యాంప్లో విషాదం..
- ఢిల్లీలో మెరిసిన భారత తొలి బుల్లెట్ ట్రైన్ లుక్!
- శాంతిభద్రతల పరిరక్షణలో సరికొత్త అస్త్రం 'సాక్ ఐ'
- యూఏఈ ప్రైవేట్ ఉద్యోగులకు ఈద్ అల్ అదా సెలవులు ప్రకటింపు









