స్కాలర్ షిప్ దరఖాస్తు గడువు 20 వరకు పొడిగింపు
- April 01, 2026
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ, పీహెచ్సీ విద్యార్థులు స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి దరఖాస్తు గడువును పొడిగించారు. గతంలో ప్రకటించినట్టుగా దరఖాస్తు గడువు మార్చి 31 వరకు ఉండగా.. దానిని కాస్త ఈ నెల 20 వరకు పొడిగించారు. 2025-26 విద్యా సంవత్సరానికి కొత్తగా స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకోవడంతోపాటు గతంలో దరఖాస్తు చేసుకొని రెన్యూవల్ స్కాలర్షిప్ల మంజూరు కోసం తెలంగాణ ఇపాస్ వెబ్సైట్లో కళాశాలలు, విద్యార్థుల నమోదుకు గడువును ఈ నెల 20 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
పోస్ట్మెట్రిక్ స్కాలర్షిప్ల మంజూరు పంపిణీలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని నిర్ధారించడానికి ఇపాస్ పోర్టల్ అనే ఆన్లైన్ సిస్టమ్ వెబ్సైట్ను అమలు చేస్తున్నారు. పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ కింద కొత్తగా దరఖాస్తు, పునరుద్ధరణ స్కాలర్షిప్ల మంజూరు కోసం డేటాను ప్రాసెస్ చేయడానికి, నమోదు చేసుకోవడానికి ఈ సిస్టమ్ కళాశాలలు, విద్యార్థుల రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం కల్పించారు. గత ఏడాది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ, పీహెచ్సీ విద్యార్థులు 10,89,253 మంది స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 9,70,243 మంది మాత్రమే నమోదు చేసుకున్నారు. కొత్తగా వివిధ కోర్సుల్లో 2025-26 విద్యా సంవత్సరంలో చేరిన విద్యార్థుల్లో ఇప్పటి వరకు 3,70,375 మంది మాత్రమే స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.
తాజా వార్తలు
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







