ఇరాన్ దాడులతో గల్ఫ్ దేశాలను రెచ్చగొడుతుంది..!!
- April 01, 2026
జెనీవా: ఇరాన్ దాడులను అరికట్టడానికి మరియు అంతర్జాతీయ మద్దతును సమీకరించేందుకు జెనీవాలోని గల్ఫ్ దేశాల కూటమి, మానవ హక్కుల మండలిలో తన ప్రయత్నాలను కొనసాగిస్తుందని కువైట్ తెలిపింది.
జెనీవాలోని ఐక్యరాజ్యసమితి మరియు ఇతర అంతర్జాతీయ సంస్థలలో కువైట్ శాశ్వత ప్రతినిధి నాసర్ అల్ హయెన్ మాట్లాడుతూ .. ఇరాన్ దాడులను చూస్తే ఈ ప్రాంతాన్ని అస్థిరపరిచేందుకు ముందుగా ప్లాన్ చేసుకున్న ఉద్దేశాలను ప్రతిబింబిస్తోందని, దీని వలన ప్రాంతీయ పరిధిని దాటి విపత్కర పరిణామాలు సంభవించవచ్చని హెచ్చరించారు.
అంతర్జాతీయ చట్టాలు, ఒప్పందాలను ఉల్లంఘించే తీవ్రమైన రెచ్చగొట్టే చర్యలు జరుగుతున్నప్పటికీ.. సంయమనం, ఉద్రిక్తతలను తగ్గించాలని పిలుపునిచ్చిన గల్ఫ్ సహకార మండలి దేశాలలోని నాయకత్వాన్ని అల్ హయెన్ ప్రశంసించారు.
పౌరులను, కీలక మౌలిక సదుపాయాలను, చమురు సౌకర్యాలను ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకోవడం అంతర్జాతీయ మానవతా చట్టాన్ని తీవ్రంగా ఉల్లంఘించడమేనని ఆయన పేర్కొన్నారు.
ఇరాన్ చర్యలు ప్రపంచ ఆహార సరఫరా చైన్ లను దెబ్బతీసే ఒక వ్యవస్థీకృత ఆర్థిక దాడికి పాల్పడటమేనని, హోర్ముజ్ జలసంధిని మూసివేస్తే ప్రపంచ ఆహార భద్రతపై తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తున్న ఐక్యరాజ్యసమితి నివేదికలను రాయబారి గుర్తు చేశారు.
బహ్రెయిన్, కువైట్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఒమన్, ఖతార్, జోర్డాన్ వంటి ఈ ప్రాంతంలోని పలు దేశాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ జరిపిన దాడులను ఖండిస్తూ, ఐక్యరాజ్యసమితి చార్టర్ ప్రకారం ఈ దేశాలకు ఆత్మరక్షణ చేసుకునే సహజ హక్కు ఉందని మానవ హక్కుల మండలి ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించడాన్ని ఆయన స్వాగతించారు.
తాజా వార్తలు
- స్కాలర్ షిప్ దరఖాస్తు గడువు 20 వరకు పొడిగింపు
- AN-26 విమానం కుప్పకూలి 29 మంది దుర్మరణం
- కువైట్ లో ఉగ్రవాద విచారణలు వేగవంతం..!!
- యూఏఈలో పెట్రోల్ బంకుల వద్ద భారీగా క్యూ లైన్లు..!!
- కువైట్కు కొత్త బస్సు మార్గాలను ప్రకటించిన సౌదీ..!!
- మస్కట్లో డిస్టన్స్ లెర్నింగ్ ప్రారంభం..!!
- ఇరాన్ దాడులతో గల్ఫ్ దేశాలను రెచ్చగొడుతుంది..!!
- రక్షణ సహకారం పై ఖతార్ ప్రధాని, యూకే రక్షణ కార్యదర్శి చర్చలు..!!
- గుజరాత్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- ఖతార్ ఎమిర్కు యూఏఈ అధ్యక్షుడి స్వాగతం









