AN-26 విమానం కుప్పకూలి 29 మంది దుర్మరణం
- April 01, 2026
రష్యా సైన్యానికి చెందిన ఏఎన్-26 రవాణా విమానం క్రిమియా ద్వీపకల్పంలో కుప్పకూలింది. ఈ ఘోర ప్రమాదంలో విమానంలోని ఆరుగురు సిబ్బంది, 23 మంది ప్రయాణికులు సహా మొత్తం 29 మంది మరణించినట్లు అధికారులు ధ్రువీకరించారు. విమానం నేరుగా ఒక కొండను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు స్థానిక అధికారులు వెల్లడించారు.
రక్షణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం మార్చి 31న మాస్కో కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటల సమయంలో షెడ్యూల్ ప్రకారం ప్రయాణిస్తున్న విమానంతో అకస్మాత్తుగా సంబంధాలు తెగిపోయాయి. వెంటనే అప్రమత్తమైన అధికారులు గాలింపు చర్యలు ప్రారంభించారు. కొంతసేపటి తరువాత గాలింపు బృందం విమాన శకలాలను గుర్తించింది. అయితే అందులో ఉన్న వారిలో ఎవరూ బతికిలేరని అధికారులు నిర్ధారించారు. ఈ ఘటనతో రష్యా సైనిక వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
ప్రాథమిక సమాచారం ప్రకారం సాంకేతిక లోపం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. శత్రువుల దాడి జరిగిందనే కోణం లేదని రక్షణ శాఖ స్పష్టం చేసింది. ఏఎన్-26 తేలికపాటి సైనిక రవాణా విమానం. దీని ద్వారా తక్కువ, మధ్యస్థ దూరాలకు సరుకుతో పాటు సుమారు 40 మంది వరకు ప్రయాణికులను తరలించే సామర్థ్యం ఉంది.
గత సంవత్సరం డిసెంబర్ 2025లో కూడా రష్యాలో ఇలాంటి విమాన ప్రమాదం చోటుచేసుకుంది. మరమ్మతుల అనంతరం నిర్వహించిన పరీక్షా విమాన ప్రయాణం సమయంలో ఏఎన్-22 విమానం కుప్పకూలి ఏడుగురు సిబ్బంది మరణించారు. తాజా ఘటనతో రష్యా సైన్యంలో మరోసారి విషాదం నెలకొంది. ప్రమాదానికి అసలు కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
తాజా వార్తలు
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!
- ఖతార్లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం..!!
- 459 మంది ఖైదీలకు ఒమన్ సుల్తాన్ క్షమాభిక్ష..!!
- సౌదీలో ఉరుములు, పిడుగులతో వర్షాలు.. 46 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- 200 కి.మీ వేగంతో కారు నడిపిన కువైట్ పౌరుడికి జైలుశిక్ష..!!
- మానవ అక్రమ రవాణా కేసు అప్పీల్పై విచారణ వాయిదా...!!
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!







