AN-26 విమానం కుప్పకూలి 29 మంది దుర్మరణం
- April 01, 2026
రష్యా సైన్యానికి చెందిన ఏఎన్-26 రవాణా విమానం క్రిమియా ద్వీపకల్పంలో కుప్పకూలింది. ఈ ఘోర ప్రమాదంలో విమానంలోని ఆరుగురు సిబ్బంది, 23 మంది ప్రయాణికులు సహా మొత్తం 29 మంది మరణించినట్లు అధికారులు ధ్రువీకరించారు. విమానం నేరుగా ఒక కొండను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు స్థానిక అధికారులు వెల్లడించారు.
రక్షణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం మార్చి 31న మాస్కో కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటల సమయంలో షెడ్యూల్ ప్రకారం ప్రయాణిస్తున్న విమానంతో అకస్మాత్తుగా సంబంధాలు తెగిపోయాయి. వెంటనే అప్రమత్తమైన అధికారులు గాలింపు చర్యలు ప్రారంభించారు. కొంతసేపటి తరువాత గాలింపు బృందం విమాన శకలాలను గుర్తించింది. అయితే అందులో ఉన్న వారిలో ఎవరూ బతికిలేరని అధికారులు నిర్ధారించారు. ఈ ఘటనతో రష్యా సైనిక వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
ప్రాథమిక సమాచారం ప్రకారం సాంకేతిక లోపం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. శత్రువుల దాడి జరిగిందనే కోణం లేదని రక్షణ శాఖ స్పష్టం చేసింది. ఏఎన్-26 తేలికపాటి సైనిక రవాణా విమానం. దీని ద్వారా తక్కువ, మధ్యస్థ దూరాలకు సరుకుతో పాటు సుమారు 40 మంది వరకు ప్రయాణికులను తరలించే సామర్థ్యం ఉంది.
గత సంవత్సరం డిసెంబర్ 2025లో కూడా రష్యాలో ఇలాంటి విమాన ప్రమాదం చోటుచేసుకుంది. మరమ్మతుల అనంతరం నిర్వహించిన పరీక్షా విమాన ప్రయాణం సమయంలో ఏఎన్-22 విమానం కుప్పకూలి ఏడుగురు సిబ్బంది మరణించారు. తాజా ఘటనతో రష్యా సైన్యంలో మరోసారి విషాదం నెలకొంది. ప్రమాదానికి అసలు కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
తాజా వార్తలు
- ట్యాంక్ బండ్ శివకు సీఎం భారీ సాయం
- స్కాలర్ షిప్ దరఖాస్తు గడువు 20 వరకు పొడిగింపు
- AN-26 విమానం కుప్పకూలి 29 మంది దుర్మరణం
- కువైట్ లో ఉగ్రవాద విచారణలు వేగవంతం..!!
- యూఏఈలో పెట్రోల్ బంకుల వద్ద భారీగా క్యూ లైన్లు..!!
- కువైట్కు కొత్త బస్సు మార్గాలను ప్రకటించిన సౌదీ..!!
- మస్కట్లో డిస్టన్స్ లెర్నింగ్ ప్రారంభం..!!
- ఇరాన్ దాడులతో గల్ఫ్ దేశాలను రెచ్చగొడుతుంది..!!
- రక్షణ సహకారం పై ఖతార్ ప్రధాని, యూకే రక్షణ కార్యదర్శి చర్చలు..!!
- గుజరాత్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం









