AN-26 విమానం కుప్పకూలి 29 మంది దుర్మరణం
- April 01, 2026
రష్యా సైన్యానికి చెందిన ఏఎన్-26 రవాణా విమానం క్రిమియా ద్వీపకల్పంలో కుప్పకూలింది. ఈ ఘోర ప్రమాదంలో విమానంలోని ఆరుగురు సిబ్బంది, 23 మంది ప్రయాణికులు సహా మొత్తం 29 మంది మరణించినట్లు అధికారులు ధ్రువీకరించారు. విమానం నేరుగా ఒక కొండను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు స్థానిక అధికారులు వెల్లడించారు.
రక్షణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం మార్చి 31న మాస్కో కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటల సమయంలో షెడ్యూల్ ప్రకారం ప్రయాణిస్తున్న విమానంతో అకస్మాత్తుగా సంబంధాలు తెగిపోయాయి. వెంటనే అప్రమత్తమైన అధికారులు గాలింపు చర్యలు ప్రారంభించారు. కొంతసేపటి తరువాత గాలింపు బృందం విమాన శకలాలను గుర్తించింది. అయితే అందులో ఉన్న వారిలో ఎవరూ బతికిలేరని అధికారులు నిర్ధారించారు. ఈ ఘటనతో రష్యా సైనిక వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
ప్రాథమిక సమాచారం ప్రకారం సాంకేతిక లోపం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. శత్రువుల దాడి జరిగిందనే కోణం లేదని రక్షణ శాఖ స్పష్టం చేసింది. ఏఎన్-26 తేలికపాటి సైనిక రవాణా విమానం. దీని ద్వారా తక్కువ, మధ్యస్థ దూరాలకు సరుకుతో పాటు సుమారు 40 మంది వరకు ప్రయాణికులను తరలించే సామర్థ్యం ఉంది.
గత సంవత్సరం డిసెంబర్ 2025లో కూడా రష్యాలో ఇలాంటి విమాన ప్రమాదం చోటుచేసుకుంది. మరమ్మతుల అనంతరం నిర్వహించిన పరీక్షా విమాన ప్రయాణం సమయంలో ఏఎన్-22 విమానం కుప్పకూలి ఏడుగురు సిబ్బంది మరణించారు. తాజా ఘటనతో రష్యా సైన్యంలో మరోసారి విషాదం నెలకొంది. ప్రమాదానికి అసలు కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
తాజా వార్తలు
- IPL2026: ప్లే ఆఫ్స్కు హైదరాబాద్..చెన్నై ఘన విజయం
- 'స్మైలింగ్ బుద్ధా' అణు పరీక్షకు 52 ఏళ్లు: మల్లికార్జున ఖర్గే
- నక్సల్స్ రహిత తెలంగాణను తీర్చిదిద్దిన పోలీస్ అధికారులకు సన్మానం..!
- అత్యంత అరుదైన కిడ్నీ క్యాన్సర్ను జయించిన 8 నెలల చిన్నారి
- మహారాష్ట్ర విద్యార్థులతో ‘యువ సంగం’ కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్ అబ్దుల్ నజీర్
- ఎస్ఐబీ కార్యాలయాన్ని సందర్శించిన డీజీపీ సి.వి.ఆనంద్
- కర్ణాటక దుబారే క్యాంప్లో విషాదం..
- ఢిల్లీలో మెరిసిన భారత తొలి బుల్లెట్ ట్రైన్ లుక్!
- శాంతిభద్రతల పరిరక్షణలో సరికొత్త అస్త్రం 'సాక్ ఐ'
- యూఏఈ ప్రైవేట్ ఉద్యోగులకు ఈద్ అల్ అదా సెలవులు ప్రకటింపు









