షిప్పింగ్ సంస్థలు TIR వ్యవస్థలో నమోదు చేసుకోవాలి: ఖతార్
- April 02, 2026
దోహా: షిప్పింగ్ కంపెనీలు అంతర్జాతీయ రోడ్డు రవాణా (TIR) వ్యవస్థ నమోదు చేసుకోవాలని జనరల్ అథారిటీ ఆఫ్ కస్టమ్స్ పిలుపునిచ్చింది. కార్యాకలాపాలను మెరుగుపరడంలో మరియు సరిహద్దు ప్రక్రియలను వేగవంతం చేయడానికి ఇది దోహదం చేస్తుందని తెలిపింది. TIR వ్యవస్థ అంతర్జాతీయ రవాణా కార్యకలాపాలలో అధిక భద్రత మరియు విశ్వసనీయతను నిర్ధారిస్తుందని, వస్తువుల రవాణాను మెరుగుపరుస్తుందని అథారిటీ పేర్కొంది.
ఈ వ్యవస్థను స్వీకరించడం ద్వారా సరిహద్దు వద్ద వేచి ఉండే సమయాన్ని 90 శాతం వరకు తగ్గించవచ్చని, అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన కస్టమ్స్ హామీని అందించవచ్చని, సీల్ చేసిన సరుకుల సురక్షిత రవాణాకు ఉపయోగపడుతుందని పేర్కొంది.
ఈ ప్రాంతంలో TIRతో ఫుల్ ఇంటిగ్రేషన్ సాధించిన మొదటి దేశాలలో ఖతార్ కూడా ఒకటని తెలిపింది. సరళీకృత వాణిజ్య విధానాల నుండి ప్రయోజనం పొందడానికి, ఖతార్ ఛాంబర్ ప్లాట్ఫారమ్ ద్వారా నమోదును పూర్తి చేసుకోవాలని కంపెనీలకు కస్టమ్ అథారిటీ సూచించింది.
తాజా వార్తలు
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ
- విద్యుత్ షాక్ మృతులకు ఎక్స్రేషియాను పెంచిన తెలంగాణ ప్రభుత్వం
- సోషల్మీడియా పై కేంద్రం కఠిన చర్యలు!..
- విజయవాడ-హైదరాబాద్ కి కొత్తగా రెండు విమాన సర్వీసులు
- ప్రాంతీయ పరిస్థితుల పై సౌదీ, కువైట్ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- క్నెసెట్ ఆమోదించిన చట్టాన్ని ఖండించిన ఒమన్..!!
- కొత్తగా 4 భారత నగరాలకు సర్వీసుల విస్తరణ: జజీరా ఎయిర్వేస్
- యూనిఫైడ్ సెక్యూరిటీ కోఆర్డినేషన్ కోసం అరబ్ ఇంటిరియర్ మినిస్టర్స్ పిలుపు..!!
- షిప్పింగ్ సంస్థలు TIR వ్యవస్థలో నమోదు చేసుకోవాలి: ఖతార్
- టాక్సీ ఛార్జీల పై 50% తగ్గింపు, పార్కింగ్ ఫీజుల నుండి మినహాయింపు..RTA ఒప్పందం..!!









