క్నెసెట్ ఆమోదించిన చట్టాన్ని ఖండించిన ఒమన్..!!
- April 02, 2026
మస్కట్: ఇజ్రాయెల్ క్నెసెట్ ఆమోదించిన "ఖైదీలకు మరణశిక్ష చట్టం"ను ఒమన్ సుల్తానేట్ ఖండించింది. ఇది అంతర్జాతీయ మానవతా చట్టాన్ని, ముఖ్యంగా ఖైదీలు మరియు నిర్బంధంలో ఉన్నవారిని రక్షించే నిబంధనలను ఉల్లంఘించడమేనని పేర్కొంది. ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. పాలస్తీనా ఖైదీల ప్రాణాలపై దాడులను ప్రోత్సహించే లేదా వారి ప్రాథమిక మానవ హక్కులను హరించే ఎలాంటి చర్యలనైనా తాము ఖచ్చితంగా తిరస్కరిస్తామని ఒమన్ సుల్తానేట్ పునరుద్ఘాటించింది.
ప్రాంతీయ మరియు ప్రపంచ శాంతి, స్థిరత్వం దృష్ట్యా, అంతర్జాతీయ చట్టపరమైన ప్రమాణాలను పాటించాలని, ఖైదీలు మరియు నిర్బంధంలో ఉన్నవారికి రక్షణ కల్పించాలని, ఉద్రిక్తతలు పెరగకుండా నివారించాలని అంతర్జాతీయ సమాజానికి విజ్ఞప్తి చేసింది.
తాజా వార్తలు
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్







