కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ
- April 02, 2026
కేరళ: గాన గంధర్వుడు, దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కీర్తికి మరో గొప్ప గౌరవం దక్కింది. సంగీతానికి భాషా పరిమితులు లేవని నిరూపిస్తూ కేరళ రాష్ట్రంలోని పాలక్కాడ్లో ఆయన భారీ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. వీటీ భట్ట తిరిప్పాడ్ కల్చరల్ సెంటర్లో ఏర్పాటు చేసిన ఈ 10 అడుగుల కాంస్య విగ్రహాన్ని కుటుంబ సభ్యులు, సంగీత ప్రముఖులు, అభిమానుల సమక్షంలో ఘనంగా ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమానికి ఎస్పీ బాలు కుమారుడు ఎస్పీ చరణ్, ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, గాయకులు మనో, చిత్ర, హరిహరన్, సుజాత మోహన్, విజయ్ ఏసుదాస్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమం అక్కడి వాతావరణాన్ని మరింత భావోద్వేగభరితంగా మార్చింది.
సంగీత మేఘం కార్యక్రమంతో నివాళి
విగ్రహావిష్కరణ సందర్భంగా ‘సంగీత మేఘం’ పేరిట ప్రత్యేక సంగీత కార్యక్రమాన్ని నిర్వహించారు. పలువురు ప్రముఖ గాయకులు తమ గానంతో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి స్వర నివాళి అర్పించారు. ఆయన పాడిన అమర గీతాలను ఆలపిస్తూ సంగీత ప్రపంచానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు.
ఈ విగ్రహాన్ని ప్రముఖ శిల్పి ఉన్ని కణయ్ అత్యంత అందంగా రూపొందించారు. విగ్రహం రూపకల్పనలో ఎస్పీబీ యొక్క వ్యక్తిత్వం, సంగీతంపై ఆయనకున్న మక్కువను ప్రతిబింబించేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
గతంలో హైదరాబాద్లో ఎస్పీబీ విగ్రహం ఏర్పాటు విషయంలో కొన్ని వివాదాలు చోటుచేసుకున్నాయి.అయితే కేరళలో మాత్రం ఎలాంటి వివాదాలు లేకుండా ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించడం సంగీత అభిమానులను ఆనందానికి గురి చేసింది. కళాకారుడికి ప్రాంతాలు, భాషలు అనే హద్దులు ఉండవని కేరళ ప్రజలు మరోసారి చాటి చెప్పారని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తన గానంతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్నారు.16 భాషల్లో 40 వేలకు పైగా పాటలు పాడి గిన్నిస్ రికార్డు సృష్టించారు. గాయకుడిగా మాత్రమే కాకుండా నటుడు, సంగీత దర్శకుడు, డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా ఆయన తన ప్రతిభను చాటుకున్నారు.
2020లో కరోనా కారణంగా ఆయన మరణించినప్పటికీ, ఆయన గానం మాత్రం సంగీత ప్రేమికుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది.పాలక్కాడ్లో ఏర్పాటు చేసిన ఈ విగ్రహం ఆయనకు లభించిన అరుదైన గౌరవంగా నిలిచింది.
తాజా వార్తలు
- డ్రగ్స్, సైబర్ క్రైమ్ నియంత్రణపై సమగ్ర ప్రణాళికలు రూపొందించాలి: సీఎం రేవంత్
- బెంగళూరులో శ్రీశ్రీ రవిశంకర్ 70వ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- షార్జా: ఈద్ అల్ అధా సందర్భంగా విడుదల కానున్న 227 మంది ఖైదీలు
- ఈద్ అల్ అధా ముందు మే నెల జీతాలు చెల్లించాలి: కార్మిక శాఖ ఆదేశాలు
- ఈద్ అల్ అధా సందర్భంగా విడుదల కాబోతున్న 956 మంది ఖైదీలు
- హర్ముజ్ జలసంధికి చెక్..
- సౌదీలో 20 ఏళ్ల కష్టజీవితం అనంతరం స్వదేశానికి చేరనున్న ఏపీ వాసి
- స్టాలిన్ జోస్యం తో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్న సీఎం విజయ్
- లోక్ భవన్లో తెలంగాణ గవర్నర్ను కలిసిన డీజీపీ సి.వి. ఆనంద్
- ఇటలీ తో సంబంధం..అంతకుమించి: ప్రధాని మోదీ









