క్నెసెట్ ఆమోదించిన చట్టాన్ని ఖండించిన ఒమన్..!!
- April 02, 2026
మస్కట్: ఇజ్రాయెల్ క్నెసెట్ ఆమోదించిన "ఖైదీలకు మరణశిక్ష చట్టం"ను ఒమన్ సుల్తానేట్ ఖండించింది. ఇది అంతర్జాతీయ మానవతా చట్టాన్ని, ముఖ్యంగా ఖైదీలు మరియు నిర్బంధంలో ఉన్నవారిని రక్షించే నిబంధనలను ఉల్లంఘించడమేనని పేర్కొంది. ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. పాలస్తీనా ఖైదీల ప్రాణాలపై దాడులను ప్రోత్సహించే లేదా వారి ప్రాథమిక మానవ హక్కులను హరించే ఎలాంటి చర్యలనైనా తాము ఖచ్చితంగా తిరస్కరిస్తామని ఒమన్ సుల్తానేట్ పునరుద్ఘాటించింది.
ప్రాంతీయ మరియు ప్రపంచ శాంతి, స్థిరత్వం దృష్ట్యా, అంతర్జాతీయ చట్టపరమైన ప్రమాణాలను పాటించాలని, ఖైదీలు మరియు నిర్బంధంలో ఉన్నవారికి రక్షణ కల్పించాలని, ఉద్రిక్తతలు పెరగకుండా నివారించాలని అంతర్జాతీయ సమాజానికి విజ్ఞప్తి చేసింది.
తాజా వార్తలు
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ
- విద్యుత్ షాక్ మృతులకు ఎక్స్రేషియాను పెంచిన తెలంగాణ ప్రభుత్వం
- సోషల్మీడియా పై కేంద్రం కఠిన చర్యలు!..
- విజయవాడ-హైదరాబాద్ కి కొత్తగా రెండు విమాన సర్వీసులు
- ప్రాంతీయ పరిస్థితుల పై సౌదీ, కువైట్ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- క్నెసెట్ ఆమోదించిన చట్టాన్ని ఖండించిన ఒమన్..!!
- కొత్తగా 4 భారత నగరాలకు సర్వీసుల విస్తరణ: జజీరా ఎయిర్వేస్
- యూనిఫైడ్ సెక్యూరిటీ కోఆర్డినేషన్ కోసం అరబ్ ఇంటిరియర్ మినిస్టర్స్ పిలుపు..!!
- షిప్పింగ్ సంస్థలు TIR వ్యవస్థలో నమోదు చేసుకోవాలి: ఖతార్









