వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- April 02, 2026
అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును లోక్ సభ ఆమోదించడం ప్రతి తెలుగోడు గర్వించే విషయం అని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొ న్నారు. బుధవారం విజయనగరంలో విలేకర్ల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ఎపి ప్రజలందరికి ముందుగా శుభాకాంక్షలు తెలిపారు. దేశ పటంలో ఎపి రాజధాని ఎక్కడ అన్న సందిగ్ధతకు తెరదించుతూ ఈ నిర్ణయం తీసుకున్నందుకు సంతోషం వ్యక్తం చేయడంతో పాటు ప్రధానమంత్రి మోడీకి ధన్యవాదాలు తెలిపారు.
ఎపికి ఆంధ్రులు గర్వించే ప్రపంచ స్థాయి రాజధాని కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంతో తాపత్రయపడ్డారని ఆయన కృషి అమోఘం అని కొనియాడారు. శాతవాహనులు పాలించి ఎంతో చరిత్ర ఉన్న అమరావతిని నాడు రాజధానిగా బాబు ఎంపిక చేశారని గుర్తు చేశారు. నాడు చంద్రబాబు 29 వేల మంది రైతులను ఒప్పించి 33 వేల ఎకరాలు సేకరించి అమరావతిని ప్రజా రాజధానిగా ఎంపిక చేశారని రాజధానికి భూములు ఇచ్చిన రైతులందరికి మంత్రి అభినందనలు తెలిపారు.
తాజా వార్తలు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!







