రియో ఒలింపిక్స్‌ విలేజ్‌లో బుధవారం మరో చోరీ ...

- August 04, 2016 , by Maagulf
రియో ఒలింపిక్స్‌ విలేజ్‌లో బుధవారం మరో చోరీ ...

 రియో ఒలింపిక్స్‌ విలేజ్‌లో బుధవారం మరో చోరీ జరిగింది. తమ వస్తువులు దొంగతనానికి గురయ్యాయని డానిష్‌ అథ్లెట్లు చెప్పడంతో నిర్వాహకులు వారికి బహిరంగ క్షమాపణలు తెలియజేశారు. మొబైళ్లు, వస్త్రాలు, ఐపాడ్‌ కనిపించడం లేవని డెన్మార్క్‌ చెఫ్‌ డి మిషన్‌ మార్టెన్‌ రాడ్‌ట్విట్‌ టీవీ2 మీడియాతో పేర్కొన్నారు.ఒలింపిక్‌ విలేజ్‌లోని 36 భవంతుల్లో పలు సమస్యలపై డానిష్‌ ప్రతినిధులు జులై 18 నుంచి ఇప్పటివరకు దాదాపు 150 ఫిర్యాదులు చేశారు. మొబైళ్ల దగ్గర్నుంచి పక్కబట్టల వరకు చాలా పోయినట్లు తెలిపారు. గతంలోనూ ఆటగాళ్లు తమ వస్తువులు చోరీకి గురైనట్లు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com