అమరావతి భూసమీకరణ ఫేజ్–2కు గ్రీన్ సిగ్నల్
- January 02, 2026
అమరావతి: అమరావతి రాజధాని పరిధిలో రెండో దశ భూసమీకరణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది.ఈ కార్యక్రమానికి సంబంధించి రేపు అధికారిక నోటిఫికేషన్ జారీ కానుంది. పెదపరిమి, వడ్లమాను, వైకుంఠాపురం, హరిశ్చంద్రాపురం, పెదమద్దూరు, యండ్రాయి, కర్ణపూడి, లేమల్లె గ్రామాల్లో ఉన్న పట్టా భూములు, అసైన్డ్ భూములు కలిపి మొత్తం 16,666.57 ఎకరాలను సమీకరించనున్నారు. అదనంగా సుమారు 3,828.56 ఎకరాల ప్రభుత్వ భూమిని కూడా స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
భూసమీకరణ ప్రక్రియను ఫిబ్రవరి 28 నాటికి పూర్తి చేయాలన్న లక్ష్యంతో అధికారులు కార్యాచరణ చేపట్టారు.భూములు ఇచ్చే రైతులకు ప్రతిఫలంగా ప్లాట్లు అభివృద్ధి చేసి అందించాలని, నిర్ణీత కాలంలో అది జరగకపోతే రూ.5 లక్షల పరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.గత అనుభవాల నేపథ్యంలో అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి కావాలన్నదే తమ ప్రధాన ఆందోళనగా రైతులు పేర్కొంటున్నారు.అమరావతి అభివృద్ధి వేగవంతం చేయడమే లక్ష్యంగా రెండో దశ ల్యాండ్ పూలింగ్ చేపట్టామని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. భూసమీకరణ అనంతరం రాజధాని నిర్మాణ పనులు మరింత వేగంగా ముందుకు సాగుతాయని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?
- సౌదీ అరేబియాలో వడ్డీ రేట్లు పెంపు..!!
- హోర్ముజ్ జలసంధి పరిస్థితిపై ఒమన్ కీలక ప్రకటన..!!
- కువైట్లో డ్రోన్లపై మరోసారి హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్లో ఆలీ వాక్వేకు కొత్త రూపు..!!
- ఖతార్లో కీలక వడ్డీ రేట్లు పెంపు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్వేస్తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !







