ఆఫ్గానిస్థాన్లో విదేశీ పర్యాటకులపై తీవ్రవాదులు దాడి...
- August 04, 2016
ఆఫ్గానిస్థాన్లో విదేశీ పర్యాటకులపై తీవ్రవాదులు దాడి చేశారు. అఫ్ఘాన్ సైన్యానికి చెందిన సిబ్బంది తమ వాహనాల్లో పర్యాటకులకు రక్షణగా వెళ్తుండగా ఈ దాడి జరగడం గమనార్హం. చెష్టె షరీఫ్ జిల్లాలో తాలిబన్లు మాటువేసి ఒక్కసారిగా దాడిచేశారని, ఆరుగురు పర్యాటకులు గాయపడ్డారని సైనిక ప్రతినిధి తెలిపారు. ఆ సమయంలో వాహనంలో 11 మంది విదేశీ పర్యాటకులు ఉన్నారని తెలిపారు. పశ్చిమ అఫ్ఘానిస్థాన్ రాష్ట్రమైన హేరత్లో ఈ ఘటన చోటుచేసుకుంది. పర్యాటకులు హేరత్ నుండి బమియాన్ వెళ్తున్న సమయంలో ఈ దాడి జరిగినట్లు హేరత్ గవర్నర్ ప్రతినిధి జిలాని ఫర్హద్ తెలిపారు.
తాజా వార్తలు
- మెట్రాష్ యాప్ రిపోర్టింగ్ టూల్స్ ద్వారా పబ్లిక్ సేఫ్టీ..!!
- హైదరాబాద్–విజయవాడ హైవే టోల్ పై కీలక నిర్ణయం
- టెన్త్ మెరిట్తో 30 వేల జీడీఎస్ ఉద్యోగాలు
- మూసీని ఎలా డెవలప్ చేస్తారో చెప్పిన సీఎం రేవంత్
- అమరావతి భూసమీకరణ ఫేజ్–2కు గ్రీన్ సిగ్నల్
- ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్గా రబింద్ర కుమార్ అగర్వాల్
- సభ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్
- ‘భారత్ ట్యాక్సీ ‘లతో మరింత భద్రత
- అన్వేష్ ఐడీ వివరాలు కోరుతూ ఇంస్టాగ్రామ్ కు పోలీసుల లేఖ
- స్విట్జర్లాండ్: రిసార్ట్ బార్ విషాదం..47 మంది సజీవ దహనం







