బహ్రెయిన్పై దాడుల వేళ హింసాత్మక ఘటనలు.. 10 మందికి జైలుశిక్ష..!!
- July 15, 2026
మనామా: బహ్రెయిన్ లో ఇరాన్ దాడుల సమయంలో హింసాత్మక ఘటనలు, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసానికి పాల్పడిన ఇద్దరు మహిళలు సహా 10 మంది నిందితులకు హై క్రిమినల్ కోర్టు ఐదేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. ఈ మేరకు ఉగ్రవాద నేరాల విచారణ విభాగం ఒక ప్రకటనలో వెల్లడించింది. రెండు వేర్వేరు కేసుల్లో కోర్టు ఈ కీలక తీర్పులను వెలువరించింది.
గత మార్చి నెలలో బహ్రెయిన్పై ఇరాన్ దాడులు జరిగిన సమయంలో, సదరు నిందితులు ఘటనా స్థలాల్లో హింస మరియు విధ్వంసానికి పాల్పడుతుండగా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన భద్రతా సిబ్బంది రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. భద్రతా విభాగం ఇచ్చిన నివేదికల ఆధారంగా పబ్లిక్ ప్రాసిక్యూషన్ తక్షణమే దర్యాప్తు చేపట్టింది.
సాక్షుల స్టేట్మెంట్లు, ఫోరెన్సిక్ మరియు సాంకేతిక నివేదికల ఆధారంగా నేరం రుజువు కావడంతో నిందితులను హై క్రిమినల్ కోర్టుకు రిఫర్ చేశారు.
కోర్టు పలు దఫాలుగా విచారణ జరిపి, నిందితులకు జైలు శిక్షలతో పాటు వారి వద్ద నుండి స్వాధీనం చేసుకున్న సొత్తును జప్తు చేయాలని ఆదేశించింది. ఈ సందర్భంగా పబ్లిక్ ప్రాసిక్యూషన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. సమాజ భద్రతకు ముప్పు కలిగిస్తూ, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా విధ్వంసాలకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







