అబ్బాసియా జ్యువెలరీ చోరీ కేసును ఛేదించిన పోలీసులు..!!
- July 15, 2026
కువైట్ సిటీ: జ్లీబ్ అల్-షుయూఖ్ (అబ్బాసియా) ప్రాంతంలోని ఒక జ్యువెలరీ దుకాణంలో జరిగిన సంచలన చోరీ కేసును ఫర్వానియా గవర్నరేట్ ఇన్వెస్టిగేషన్ విభాగానికి చెందిన క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ (CID) అధికారులు విజయవంతంగా ఛేదించారు. ఈ కేసులో ఇద్దరు సిరియన్ జాతీయులను అరెస్ట్ చేసిన పోలీసులు, వారి వద్ద నుండి చోరీకి గురైన 39,000 కువైట్ దినార్ల విలువైన బంగారు ఆభరణాలు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
నకిలీ పిస్టల్, కత్తితో జ్యువెలరీ షాపులోకి చొరబడిన ఇద్దరు దుండగులు, అక్కడ ఉన్న సిబ్బందిని బెదిరించి ఈ భారీ దోపిడీకి పాల్పడ్డారు. అనంతరం వారు అక్కడి నుంచి పరారయ్యారని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. అధికారులు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి నిందితులను గుర్తించారు. నిందితుల్లో ఒకరిపై ఇదివరకే రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘనకు సంబంధించిన అరెస్ట్ వారెంట్లు ఉన్నట్లు తేలింది. అలాగే, ఈ దోపిడీ కోసం నిందితులు ఒక వాహనాన్ని దొంగిలించారని, ఆ వాహనాన్ని జ్లీబ్ అల్-షుయూఖ్ ప్రాంతంలో తగులబెట్టారని పోలీసులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- కువైట్ పై డ్రోన్ దాడి విఫలం.. గగనతలంలోనే కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- భారతీయులను వీసా లేకుండా థాయిలాండ్ కు వెళ్లొచ్చు
- AP విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు..
- అబుదాబిలో త్వరలో నెలవారీ ఇంటి అద్దె చెల్లింపు సౌకర్యం..
- అబ్బాసియా జ్యువెలరీ చోరీ కేసును ఛేదించిన పోలీసులు..!!
- బహ్రెయిన్పై దాడుల వేళ హింసాత్మక ఘటనలు.. 10 మందికి జైలుశిక్ష..!!
- దివంగత ఫాదర్ అమీర్ మృతికి పలువురు ప్రముఖులు సంతాపం..!!
- అజ్మాన్ కార్నిష్ టవర్స్లో భారీ అగ్నిప్రమాదం..తప్పిన ప్రమాదం..!!
- ఒమన్ తీరంలో ఆయిల్ ట్యాంకర్లపై దాడులు..ఒకరు మృతి, ముగ్గురు గల్లంతు..!!
- స్టేట్ రెవెన్యూ చట్టానికి సౌదీ ఆమోదం..విదేశీయులకు కొత్త ట్రైనింగ్ వీసా..!!







