ట్రంప్ ఇరాన్ వార్ వార్నింగ్: 24 గంటల్లో విధ్వంసం అంటూ సంచలనం
- April 07, 2026
అమెరికా: పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేవలం 24 గంటల్లోనే ఇరాన్ను పూర్తిగా తుడిచిపెట్టగలమని ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఇన్నాళ్లూ ఓపిక పట్టానని, కానీ ఇక సహనం కోల్పోయానని ట్రంప్ హెచ్చరించారు.
భారీ సైనిక సన్నాహాలు
ఇరాన్ పై ఆపరేషన్ కోసం అమెరికా భారీ సైనిక సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ ఆపరేషన్లో 4 బాంబర్లు, 55 అత్యాధునిక ఎయిర్ క్రాఫ్ట్స్, 64 ఫైటర్ జెట్లు, 13 రెస్క్యూ విమానాలు, 48 ట్యాంకర్లు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అవసరమైతే ఇరాన్లోని కీలక మౌలిక సదుపాయాలను ధ్వంసం చేస్తామని ట్రంప్ హెచ్చరించారు.
ఇరాన్ ప్రతిస్పందన
ట్రంప్ హెచ్చరికలకు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ తీవ్రంగా స్పందించాయి. అమెరికా బెదిరింపులకు తాము భయపడమని స్పష్టం చేశాయి.ఇటీవల ఒక అమెరికా మిలిటరీ అధికారిని తమ అదుపులోకి తీసుకున్నామని ఇరాన్ ప్రకటించింది. ఈ పరిణామాలతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి.
తాజా వార్తలు
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్
- నకిలీ యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- 25 ఏళ్ల తర్వాత అప్పు తీర్చిన స్నేహితుడు..
- భారత్, న్యూజిలాండ్ ల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం
- పవన్ కల్యాణ్కు సర్జరీ సక్సెస్..త్వరగా కోలుకోవాలన్న సీఎం చంద్రబాబు!
- వేసవి రద్దీకి దుబాయ్ ఎయిర్పోర్ట్స్ సిద్ధం..
- మల్కాజ్గిరి భద్రత, పరిశుభ్రత పై పోలీస్–మున్సిపల్ శాఖల సమన్వయ సమావేశం
- షార్జాలో పర్యాటక రంగానికి భారీ ఊరట..!!
- ఇంట్లోనే అక్రమంగా రెస్టారెంట్..పలు ఉల్లంఘనలు నమోదు..!!
- ఒమన్–భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం.. సముద్ర భద్రతపై కీలక చర్చలు..!!







